Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమలతో మాట్లాడిన ప్రియాంకా గాంధీ, కొండా సురేఖ రాజీనామా?

ఐవీఆర్
శనివారం, 5 అక్టోబరు 2024 (15:27 IST)
భారాస నాయకుడు కేటీఆర్ పైన వ్యాఖ్యానిస్తున్న క్రమంలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్కినేని నాగార్జున, చైతన్య, సమంతల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసారు. ఇవి కాస్తా తీవ్ర దుమారం రేపాయి. కేటీఆర్ కారణంగానే నాగచైతన్య-సమంత విడాకులు తీసుకున్నారని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు సురేఖ చెప్పారు. ఐతే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
 
అక్కినేని నాగార్జున సతీమణి అక్కినేని అమలతో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల తమ కుటుంబం తీవ్రంగా ఆవేదన చెందుతున్నామని ప్రియాంకతో అమల చెప్పినట్లు సమాచారం. దీనితో కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలని పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
 
ఐతే పదవి నుంచి నేరుగా ఆమెను తొలగించకుండా, కొండా సురేఖ తనంతట తానుగా రాజీనామా చేయాలని సమాచారం పంపినట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఏం జరుగుతుందో వేచి చూద్దాము.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments