అనన్య పాండేపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రశంసలు.. కారణం అదే!

సెల్వి
శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (16:27 IST)
తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. వరద బాధితుల కోసం సినీ హీరోలు విరాళాలు ప్రకటిస్తున్నారు. అయితే హీరోయిన్లు మాత్రం వరద బాధితుల కోసం ఎలాంటి విరాళాలు ప్రకటించలేదనే చెప్పాలి. 
 
అయితే టాలీవుడ్ యువ నటి అనన్య నాగళ్ల తనవంతుగా సాయం ప్రకటించింది. ఇందులో భాగంగా  ఏపీకి రూ.2.5 లక్షలు, తెలంగాణకు రూ.2.5 లక్షలు ఇస్తున్నట్టు అనన్య సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 
 
ఈ నేపథ్యంలో అనన్య పాండేపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో, అనన్య నాగళ్ల ఏపీ ప్రభుత్వానికి విరాళం ఇవ్వడం పట్ల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. 
 
"ఆంధ్రప్రదేశ్‌లో వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2.5 లక్షల విరాళం ప్రకటించిన వర్ధమాన నటి, కుమారి అనన్య నాగళ్ల గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సహాయ కార్యక్రమాలకు మీ చేయూత బలాన్నిస్తుంది" అంటూ పవన్ కల్యాణ్ తరఫున ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. 
 
అందుకు అనన్య నాగళ్ల వినమ్రంగా స్పందిస్తూ, థాంక్యూ సో మచ్ సర్ అంటూ బదులిచ్చింది. మీరు నాకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం అంటూ ట్వీట్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ లేదని చెబుతున్న లక్ష్మణ్ టేకుముడి, రాధికా జోషి

Director Vasishta, : జంతువుల ఆత్మతోనూ కథ తో నెపోలియన్ రిటర్న్స్

Vishnu: విష్ణు విశాల్... ఆర్యన్ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్

Gopichand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి సినిమా భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments