Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

ఠాగూర్
శుక్రవారం, 28 మార్చి 2025 (15:47 IST)
ఒకపుడు మావోయిస్టు ఉద్యమంలో పని చేస్తున్న సమయంలో ఎన్‌కౌంటర్ నుంచి తృటిలో తప్పించుకున్నానని, ఈ జీవితం తనకు పునర్జన్మ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. తన భర్త, కుంజ రాము 21వ వర్థంతి సభలో ఆమె పాల్గొని ప్రసంగిస్తూ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. భర్త స్మృతులను తలచుకుని చలించిపోయారు. కన్నీటిపర్యంతమయ్యారు. తన జీవితంలోని కష్టాలను, ప్రజలకు సేవ చేయాలనే తన సంకల్పాన్ని గుర్తు చేసుకున్నారు. 
 
ఒకపుడు ఉద్యమంలో పని చేస్తున్న సమయంలో ఎన్‌కౌంటర్ నుంచి తృటిలో తప్పించుకున్నానని, అది తనకు పునర్జన్మ అని మంత్రి సీతక్క అన్నారు. ఈ జన్మలో పేదలు, ఆదివాసీలు, అట్టడుగు వర్గాల హక్కుల కోసం తన చివరి శ్వాస వరకు పోరాడుతానని ఆమె ఈ సందర్భంగా ప్రకటించారు. 
 
పాలమూరు జిల్లా కొత్తగూడ మండలం మోకాళ్లపల్లిలో జరిగిన తన భర్త వర్థంతి సభలో మంత్రి సీతక్క తన కుమారుడు సూర్య, కోడలు కుసుమాంజలితో కలిసి పాల్గొన్నారు. రాము 17 యేళ్ల వయసులోనే ఉద్యమంలో చేరి ఎన్నో పోరాటాలలో పాలుపంచుకున్నారని, ఆయన ఎల్లపుడూ అట్టడుగు వర్గాల అభివృద్ధికి పాటుపడ్డారని ఆమె గుర్తు చేసుకున్నారు. రాము నేర్పిన విలువలు, నైతికతతో తాను ప్రజల కోసం పని చేస్తున్నానని సీతక్క గుర్తుచేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments