తెలంగాణ మంత్రి కొండా సురేఖ తన పెంపుడు శునకం మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హ్యాపీ అనే శునకం గుండెపోటుతో ఆమె నివాసంలో మరణించింది. తన ఇంట్లో ఒక వ్యక్తిగా మారిన ఆ పెంపుడు కుక్క నిర్జీవ శరీరాన్ని చూసి కొండా సురేఖ కన్నీటిపర్యంతం అయ్యారు.
ఇంట్లో మనుషులతో సమానంగా చూసుకుంటున్న ఆ మూగజీవి చనిపోయేసరికి మంత్రి కొండా సురేఖ ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. భావోద్వేగానికి లోనై, ఆమె ఓదార్చలేనంతగా కన్నీరు పెట్టుకున్నారు కొండా సురేఖ. కుక్క మృతదేహంపై పువ్వులు చల్లి నివాళి అర్పించారు.
అనంతరం దానికి అంతిమసంస్కారాలు నిర్వహించారు. ప్రస్తుతం ఈ శునకం మరణించడంతో కొండా సురేఖ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. శునకానికి అంత్యక్రియలు నిర్వహించడం చూసి నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.