Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రంక్ అండ్ డ్రైవ్ జరిమానా కట్టకపోతే జైలుకు పోతావ్: భయంతో ఉరి వేసుకున్న వ్యక్తి

ఐవీఆర్
శనివారం, 21 జూన్ 2025 (15:11 IST)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ ఓ వ్యక్తి జరిమానా చెల్లించకపోతే జైలుకు పోతావని పోలీసులు చేసిన హెచ్చరికతో భయపడిపోయి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకున్నది.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఖమ్మం జిల్లా లోని ముదిగొండకు చెందిన 25 ఏళ్ల గోపి ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అతడి భార్య కొత్తగూడెంలో నర్సింగ్ చేస్తుండటంతో ఇతడు కూడా అక్కడికే మకాం మార్చాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో పని ముగించుకుని వస్తూవస్తూ మద్యం సేవించాడు. మద్యం సేవించి ద్విచక్రవాహనం నడుపుతుండటంతో పోలీసులకు పట్టుబడ్డాడు.
 
అనంతరం జూన్ 19న అతడికి పోలీసులు ఫోన్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కోర్టుకి హాజరై జరిమానా కట్టాలనీ, లేదంటే జైలుకు వెళ్తావంటూ హెచ్చరించారు. దీనితో భయాందోళనలకు గురైన గోపి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై గోపీ భార్య ... తన భర్త మరణానికి పోలీసులు అతడిని భయపెట్టడమే కారణమంటూ బోరుమంటూ విలపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ లో ఆయన రియల్ హీరో : ప్రియాంక అరుళ్ మోహన్

NTR: యుఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ ను కలిసిన ఎన్.టి.ఆర్.

సిద్ధు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా చిత్రం తెలుసు కదా షూటింగ్ పూర్తి

Chiranjeevi: కిష్కింధపురి సినిమా చాలా బావుంది : మెగాస్టార్ చిరంజీవి

గ్రామీణ రాజకీయాలలో స్త్రీ ముద్ర చూపిస్తూ ప్రభుత్వ సారాయి దుకాణం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో సిగ్నేచర్ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్న జోస్ అలుక్కాస్

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

Mustard oil: ఆవనూనెతో ఆరోగ్యం మాత్రమే కాదు.. అందం కూడా..?

Coconut Milk: జుట్టు ఆరోగ్యానికి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

తర్వాతి కథనం
Show comments