Webdunia - Bharat's app for daily news and videos

Install App

షిప్టు కారులో వచ్చి - కెమెరాలకు స్ప్రేకొట్టి... ఎస్బీఐ ఏటీఎంలో చోరీ... (Video)

ఠాగూర్
ఆదివారం, 2 మార్చి 2025 (12:20 IST)
తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిర్యాలలోని ఎస్బీఐ ఏటీఎంలో దొంగలుపడ్డారు. షిప్టు కారులో వచ్చిన ఈ దొంగలు ఏటీఎం కేంద్రాన్ని పగులగొట్టి రూ.30 లక్షల నగదును చోరీ చేసి పారిపోయారు. రంగారెడ్డి జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఈ చోరీజరిగింది. ఈ చోరీకి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పోలీసుల కథనం మేరకు.. జిల్లాలోని మహేశ్వరం మండలం రావిర్యాలలో ఎస్బీఐ ఏటీఎం ఉండగా, ఇక్కడకు కారులో వచ్చిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు పక్కా ప్లానింగ్‌తో చోరీ చేశారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా స్ప్రే కొట్టి, ఎమర్జెన్సీ మోగకుండా వైర్లు కట్ చేశారు. గ్యాస్ కట్టర్, ఇనుపరాడ్లుతో ఏటీఎంను బద్ధలు కొట్టి, నగదు పెట్టెతో సహా ఉడాయించారు. ఇదంతా కేవలం 4 నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది. 
 
ఇందుకోసం పక్కా ప్లాన్‌తో ఈ చోరులు అక్కడకు రావడం గమనార్హం. ఈ ఏటీఎంలో రెండు రోజుల క్రితమే రూ.30 లక్షల నగదును ఉంచినట్టు బ్యాంక్ మేనేజరు తెలిపారు. ఈ సమాచారం తెలిసిన వారే పక్కా ప్లాన్‌‍తో చోరీ చేసిటన్టు పోలీసులు భావిస్తున్నారు. చోరీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో ఉంచగా, అది వైరల్ అయింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవికి బ్రిటన్ పౌరసత్వం : వార్తల్లో నిజం లేదని స్పష్టీకరణ

హీరోయిన్లకు వయసు పెరిగితే ప్రేక్షకులు ఒప్పుకోవడం లేదు : జ్యోతిక

జీవితంలో గుడ్ డే, బ్యాడ్ డే రెండూ ఒకే రోజు జరిగాయనేది శివంగి గ్రిప్పింప్

Nani: నాని ప్రెజెంట్ కోర్టు - స్టేట్ vs ఎ నోబడీ గ్లింప్స్ రిలీజ్

Tarun Bhaskar : సంతాన ప్రాప్తిరస్తు నుంచి తరుణ్ భాస్కర్ క్యారెక్టర్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments