Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరీక్షా హాలులో పురిటినొప్పులు - ఆస్పత్రిలో ప్రసవం

ఠాగూర్
ఆదివారం, 2 మార్చి 2025 (11:45 IST)
ప్రభుత్వ ఉద్యోగ వేటలో భాగంగా కొన్ని నెలల పాటు కష్టపడిన చదివిన ఓ మహిళకు ఉద్యోగ పరీక్ష రాస్తుండగా పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పరీక్ష రాయలేకపోయినప్పటికీ పండంటి కుమార్తెకు జన్మనివ్వడం సంతోషంగా ఉందని ఆ మహిళ వెల్లడించింది. 
 
ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలో గత నెల 28వ తేదీన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయలు ఎంపికకు సంబంధించి ఇటీవల ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ అర్హత పరీక్షను నిర్వహించింది. గత నెల 27, 28వ  తేదీల్లో ఈ పరీక్షలు జరిగాయి. 
 
టోంక్ జిల్లా మాల్ పురాలో గత నెల 28వ తేదీన పరీక్ష రాస్తున్న అభ్యర్థులలో ప్రియాంక చౌధరి అనే గర్భిణికి పురిటినొప్పులు వచ్చాయి. దీంతో హుటాహుటిన అంబులెన్స్‌లో టోంక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు వైద్యులు సాధారణ ప్రసంవం చేయడంతో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. పరీక్ష మరోమారు రాసుకోవచ్చని, కానీ తమ ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందని ప్రియాంక భర్త జీత్ రామ్ చౌధరి హర్షం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినీ బృందం (video)

Tabu: పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి చిత్రంలో టబు ఎంట్రీ

యాదార్థ సంఘటనల ఆధారంగా ప్రేమకు జై సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments