Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితులే పొట్టనబెట్టుకున్నారు.. యువతి ప్రేమ కోసం కత్తితో పొడిచి చంపేశారు... (video)

సెల్వి
శుక్రవారం, 23 ఆగస్టు 2024 (12:54 IST)
Engineering student
స్నేహితులే ఆ యువకుడిని పొట్టనబెట్టుకున్నారు. యువతి ప్రేమ విషయంలో ఇంజనీరింగ్ విద్యార్థి దారుణంగా హత్యకు గురైనాడు. బాలాపూర్‌ పోలీస్‏స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మంకు చెందిన శాంతయ్య, అనితకు ప్రశాంత్ ఏకైక పుత్రుడు.  ఎంవీఎస్ఆర్‌ కాలేజ్‌లో ఇంజనీరింగ్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. 
 
గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో బాలాపూర్‌ గణేశ్‌ చౌక్‌ వద్ద స్నేహితులకు ప్రశాంత్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. ముగ్గురు యువకులు ప్రశాంత్‌పై దాడికి పాల్పడ్డారు. అందులో ఒకడు తన వద్ద ఉన్న కత్తితో ప్రశాంత్‌ కడుపులో మూడుసార్లు పొడిచాడు. 
 
ప్రశాంత్‌ రక్తపు మడుగులో పడిపోగానే ముగ్గురు బైక్‌పై పరారయ్యారు. సమాచారం అందుకున్న బాలాపూర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా ప్రశాంత్‌ అప్పటికే మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హత్య చేసి పరారైన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments