Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యవసాయ సంక్షోభానికి కారణం కాంగ్రెస్సే.. కేటీఆర్ ఫైర్

సెల్వి
సోమవారం, 1 ఏప్రియల్ 2024 (22:59 IST)
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తన అసమర్థతతో రాష్ట్రంలో కరువు తెచ్చిందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభాన్ని ప్రభుత్వం తప్పుగా నిర్వహించిందని, ఆపదలో ఉన్న రైతులకు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులకు ప్రకృతి కారణం కాదన్నారు. ఈ పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిపెట్టాయని, ప్రకృతి వల్ల కాదని పేర్కొన్నారు.
 
నల్గొండ జిల్లాలో పర్యటించి కొద్దిమంది రైతులతో మాట్లాడిన కేటీఆర్.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం వల్లే వ్యవసాయ సంక్షోభం తలెత్తిందని అన్నారు. రాజకీయ కార్యకలాపాలకు పాల్పడుతూ రైతు సమస్యలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శించారు. రైతులను పరామర్శించి హామీ ఇవ్వడంలో విఫలమైన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన సహచరుల చిత్తశుద్ధి ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు.
 
కాంగ్రెస్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో దాదాపు 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్టోరీ, స్క్రీన్‌ప్లే సరికొత్తగా కౌలాస్ కోట చిత్రం రూపొందుతోంది

హైద‌రాబాద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల‌కు హీరో కృష్ణసాయి సాయం

థ్రిల్లర్ అయినా కడుపుబ్బా నవ్వించే షోటైం: నవీన్ చంద్ర

Dil Raju: మా రిలేషన్ నెగిటివ్ గా చూడొద్దు, యానిమల్ తో సినిమా చేయబోతున్నా: దిల్ రాజు

మార్గన్ లాంటి చిత్రాలు చేసినా నాలో రొమాంటిక్ హీరో వున్నాడు : విజయ్ ఆంటోని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments