Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు!!

ఠాగూర్
ఆదివారం, 2 జూన్ 2024 (12:10 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానానికి స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఉప ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి చెందిన అభ్యర్థి విజయం సాధించారు. మే నెల 28వ తేదీన ఈ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ జరగ్గా, జూన్ రెండో తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు. ఈ లెక్కింపులో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి 109 ఓట్ల తేడాతో విజయభేరీ మోగించారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఐదు టేబుళ్లపై ప్రారంభమైన ఓట్ల లెక్కింపు పది గంటలకు ముగిసినట్టు ప్రకటించారు. 
 
కాగా, ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో మొత్తంగా 1439 ఓటర్లు ఉన్నారు. ఇందులో ఇద్దరు మినహా అందరూ ఓటు వేశారు. వీటిలో చెల్లని ఓట్లు 21, మిగిలిన వాటిలో నవీన్ కుమార్ రెడ్డికి 762, కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డికి 653 ఓట్లు పోలయ్యాయి. దీంతో నవీన్ కుమార్ రెడ్డి గెలుపొందినట్టుగా ఎన్నికల సంఘం అధికారకంగా ప్రకటించింది. 
 
మరోవైపు, ఈ ఎన్నికల్లో గెలుపొందిన నవీన్ కుమార్‌కు పార్టీ పరంగా సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా అభినందనులు తెలిపారు. పాలమూరు నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. ఆయన గెలుపునకు కృషి చేసిన భారాస ప్రజా ప్రతినిధులకు, కార్యకర్తలకు, నాయకులకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓజీ.. ఓజీ అని వెళితే... ప్రజలు క్యాజీ అంటూ ప్రశ్నిస్తారు : పవన్ కళ్యాణ్

జీబ్రా చిత్రం నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ విడుదల

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

సీనియర్ నటుడు, వ్యాఖ్యాత ఎ.వి. రమణ మూర్తి అమర్నాధ్ యాత్రలో కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments