Webdunia - Bharat's app for daily news and videos

Install App

కింద మంట బెట్టినట్టుగా సలసల మరిగిపోతున్న వాటర్ ట్యాంకులో నీళ్లు.. (Video)

ఠాగూర్
ఆదివారం, 2 జూన్ 2024 (11:49 IST)
దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి ఉష్ణోగ్రతలు తారా స్థాయికి చేరుకున్నాయి. దీంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, ఢిల్లీలో ఓ భవనంపై ఉన్న వాటర్ ట్యాంకులోని నీళ్లు సలసల మరిగిపోతున్నట్టుగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, కొందరు నెటిజన్లు మాత్రం ఈ వీడియో నిజం కాదని కామెంట్స్ చేస్తున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ భవనంపై ఉన్న వాటర్ ట్యాంకులో నీళ్ళు కింద మంటబెట్టినట్టుగా కుతకుత ఉడిపోయాయి. ఢిల్లీలో పగటి ఉష్ణోగ్రత 52 డిగ్రీలకు చేరుకోవడంతో ట్యాంకులోని నీళ్లు ఇలా మరిగిపోతున్నాయంటూ ఓ నెటిజన్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో విషయంలో నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. 
 
ఒకరు.. అమ్మో ఈ వేడికి ఢిల్లీ జన ఎలా బతుకుతున్నారో అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తే మరికొందరు మాత్రం ఈ వీడియో ఫేక్ అని కొట్టిపడేస్తున్నారు. నీళ్లు బాయిలింగ్‌ పాయింట్ 100 డిగ్రీలని, 52 డిగ్రీల వద్ద నీళ్లు మరగడం అసాధ్యమని కొందరు కొట్టిపడేస్తున్నారు. అంతేకాదు.. ఢిల్లీలో 52 డిగ్రీల ఉష్ణోగ్రత అసలు నమోదు కాలేదని మరికొందరు చెబుతున్నారు. కాగా, రెండు రోజుల క్రితం దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత ఇక్కడ నమోదైన విషయం తెల్సిందే. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'సంక్రాంతికి వస్తున్నాం' - 3 రోజుల్లోనే రూ.106 కోట్లు వసూళ్లు!!

సైఫ్ అలీఖాన్‌కు కత్తిపోట్లు: ప్రధాన నిందితుడు అరెస్ట్?

బక్కోడికి రజిని బండోడికి బాలయ్య - తమన్ డైలాగ్ వైరల్

గేమ్ చేంజర్ పైరసీ - ఏపీ లోక‌ల్ టీవీ అప్పల్రాజు అరెస్ట్

ఆకట్టుకున్న హరి హర వీరమల్లు పార్ట్-1 మాట వినాలి పాట విజువల్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments