Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోస్టల్ బ్యాలెట్ల‌పై వైకాపాకు చుక్కెదురు : ఈసీ నిర్ణయంలో జోక్యం చేసుకోలేం!

ఠాగూర్
ఆదివారం, 2 జూన్ 2024 (11:28 IST)
పోస్టల్ బ్యాలెట్ల అంశంలో అధికార వైకాపాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో గట్టి షాక్ తగలింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టంచేసింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై ఆర్వో (రిటర్నింగ్ ఆఫీసర్) సంతకం ఉంటే సరిపోతుందని, స్టాంపు, హోదా లేకపోయినా ఫర్వాలేదన్న ఎన్నికల సంఘం వాదనలను సమర్థిస్తూ ఆంధ్రప్రదేశ్  హైకోర్టు శనివారం తీర్పును వెలువరించింది. 
 
వివాదాస్పదమైన పోస్టల్ బ్యాలెట్ల అంశంలో వైసీపీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారం 13ఏపై ఆర్వో సంతకంతో పాటు కనీసం చేతిరాతతో అయినా హోదా వివరాలు రాసి ఉండాలని ఎన్నికల సంఘం గతంలో పేర్కొందని, కానీ ఏపీ సీఈవో అందుకు భిన్నంగా మెమో జారీ చేశారని వైసీపీ తన పిటిషన్‌లో ఆరోపించింది. సంతకం ఉంటే చాలని, సీల్ లేకపోయినా ఫర్వాలేదని మెమోలో పేర్కొనడం ఈసీ నిబంధనలను ఉల్లంఘించడమేనని పేర్కొంది.
 
ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాదనలు ఆలకించిన పిమ్మట తీర్పును శనివారానికి వాయిదా వేసింది. ఆ ప్రకారంగా శనివారం తీర్పును వెలువరిస్తూ, ఈసీతో ఏకీభవిస్తూ తీర్పు వెలువరించింది. పోస్టల్ బ్యాలెట్‌పై స్టాంపు లేకపోయినా అది కౌంటింగ్‌కు చెల్లుబాటు అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో వైసీపీ పిటిషన్‌ను తోసిపుచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను OG అంటే మీరు క్యాజీ అంటే నేనేం చేయాలి: పవన్ కల్యాణ్ (video)

35-చిన్న కథ కాదు'- మనందరి కథ : హీరో రానా దగ్గుబాటి

సుహాస్ హీరోగా కోర్టు డ్రామా జనక అయితే గనక.. ఫస్ట్ లుక్

పేక మేడలు సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఆడపిల్ల .. విడుదల

వెంకటేష్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ లెంట్ వైఫ్ పాత్రల చుట్టూ తిరిగే కథే వెంకీ మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments