పోస్టల్ బ్యాలెట్ల‌పై వైకాపాకు చుక్కెదురు : ఈసీ నిర్ణయంలో జోక్యం చేసుకోలేం!

ఠాగూర్
ఆదివారం, 2 జూన్ 2024 (11:28 IST)
పోస్టల్ బ్యాలెట్ల అంశంలో అధికార వైకాపాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో గట్టి షాక్ తగలింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టంచేసింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై ఆర్వో (రిటర్నింగ్ ఆఫీసర్) సంతకం ఉంటే సరిపోతుందని, స్టాంపు, హోదా లేకపోయినా ఫర్వాలేదన్న ఎన్నికల సంఘం వాదనలను సమర్థిస్తూ ఆంధ్రప్రదేశ్  హైకోర్టు శనివారం తీర్పును వెలువరించింది. 
 
వివాదాస్పదమైన పోస్టల్ బ్యాలెట్ల అంశంలో వైసీపీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారం 13ఏపై ఆర్వో సంతకంతో పాటు కనీసం చేతిరాతతో అయినా హోదా వివరాలు రాసి ఉండాలని ఎన్నికల సంఘం గతంలో పేర్కొందని, కానీ ఏపీ సీఈవో అందుకు భిన్నంగా మెమో జారీ చేశారని వైసీపీ తన పిటిషన్‌లో ఆరోపించింది. సంతకం ఉంటే చాలని, సీల్ లేకపోయినా ఫర్వాలేదని మెమోలో పేర్కొనడం ఈసీ నిబంధనలను ఉల్లంఘించడమేనని పేర్కొంది.
 
ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాదనలు ఆలకించిన పిమ్మట తీర్పును శనివారానికి వాయిదా వేసింది. ఆ ప్రకారంగా శనివారం తీర్పును వెలువరిస్తూ, ఈసీతో ఏకీభవిస్తూ తీర్పు వెలువరించింది. పోస్టల్ బ్యాలెట్‌పై స్టాంపు లేకపోయినా అది కౌంటింగ్‌కు చెల్లుబాటు అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో వైసీపీ పిటిషన్‌ను తోసిపుచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Achanta : అఖండ 2 నిర్మించడానికి గట్టి పోటీనే ఎదుర్కొన్నాం : రామ్, గోపీచంద్ ఆచంట

Bhumika Chawla: యూత్ డ్రగ్స్ మహమ్మారి బ్యాక్ డ్రాప్ తో యుఫోరియా చిత్రం

Samantha Ruth Prabhu: రాజ్ నిడిమోరును పెళ్లాడిన సమంత రూతు ప్రభు

Harshali Malhotra: ఎనర్జీ కోసం ఉదయం దీనిని తాగమని ఆయన నాకు చెప్పేవారు: హర్షాలి మల్హోత్రా

'మన శంకర వరప్రసాద్ గారు'లో ఆ ఇద్దరు స్టార్ హీరోల స్టెప్పులు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments