Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ (పీవీకే) విదేశీ భూభాగమే : పాక్ అటార్నీ జనరల్

ఠాగూర్
ఆదివారం, 2 జూన్ 2024 (11:21 IST)
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) విదేశీ భూభాగమేనని పాకిస్థాన్ ప్రభుత్వం తాజాగా అంగీకరించింది. ఇస్లామాబాద్ హైకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా ఈ మేరకు పేర్కొంది. పీఓకేకు చెందిన జర్నలిస్టు అహ్మద్ ఫర్హాద్ షాను రావల్పిండిలోని తన నివాసంలో కొందరు కిడ్నాప్ చేశారు. 
 
పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఏజెంట్లే అతడిని అపహరించారన్న వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఫర్హాద్ భార్య హైకోర్టును ఆశ్రయించారు. తన భర్తను కోర్టు ముందు హాజరపరిచేలా పాక్ ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు.
 
ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా పాక్ ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ తన వాదన వినిపించారు. ఫర్హాద్‌ను పీఓకే పోలీసులు అరెస్టు చేశారని, పీఓకే విదేశీ భూభాగమని పేర్కొన్నారు. అక్కడ ప్రత్యేక కోర్టులు, పోలీసు వ్యవస్థ వున్నాయని అన్నారు. ఆ భూభాగం తమ పరిధిలోకి రాదన్నారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ అది విదేశీ భూభాగమైతే పాక్ మిలిటరీ నిత్యం పీఓకేలోకి ఎందుకు చొరబడుతుందని సూటి ప్రశ్న వేశారు. 
 
ఐఎస్ఐ జనాలను అపహరించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, ధిర్కోట్ పోలీసులు ఫర్హాద్‌ను అరెస్టు చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఇదిలావుంచితే, పీఓకే ఎప్పటికీ భారత్ భూభాగమేనని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments