Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 16 April 2025
webdunia

బీఆర్ఎస్ పార్టీ వుండదా? వైసిపిని చూడండి: విజయశాంతి భారాసలో చేరుతారా?

Advertiesment
Vijayashanti

ఐవీఆర్

, శుక్రవారం, 17 మే 2024 (18:27 IST)
రాములమ్మగా పిలుపించుకునే విజయశాంతి తాజాగా చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షులు కిషన్ రెడ్డి ఇటీవల మాట్లాడుతూ... భవిష్యత్తులో కేసీఆర్ స్థాపించిన భారాస కనుమరుగవుతుందని అన్నారు. దీనిపై విజయశాంతి తనదైన శైలిలో స్పందించారు. ఆమె తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఇలా పేర్కొన్నారు.
 
''తెలంగాణల బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి అభిప్రాయం సమంజసం కాదు. ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానం. ఎప్పటికీ.. ఇది అర్ధం చేసుకోకుండా వ్యవహరించే వారికి... దక్షిణాది.... దశాబ్ధాలుగా కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, రామకృష్ణ హెగ్డే, జయలలిత గార్ల నుండి ఇప్పటి బీఆర్ఎస్, వైసిపి దంక ఇస్తున్న రాజకీయ సమాధానం విశ్లేషించుకోవాల్సిన తప్పని అవసరం... ఎన్నడైనా.. వాస్తవం.
 
ఈ దక్షిణాది స్వీయ గౌరవ అస్థిత్వ సత్యం కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు, బీజేపీ కనీసం ఆలోచన చెయ్యని అంశం బహుశా కిషన్ రెడ్డి గారి ప్రకటన భావం. హర హర మహాదేవ్. జై తెలంగాణ'' అంటూ విజయశాంతి పేర్కొన్నారు. ఐతే ఏపీలో వైసిపిని ఎండగడుతున్న పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ కూడా వున్నది. మరి ఆ సంగతి తెలిసి కూడా విజయశాంతి వైసిపిని వెనకేసుకు వస్తున్నారా? లేదంటే ఆమె భారాస పార్టీలోకి తిరిగి వెళ్లిపోతారా అంటూ నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ఆగస్టు కోటా ఆర్జిత సేవా టిక్కెట్లు