హైదరాబాద్లోని సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన అల్లు అర్జున్కు తీవ్ర సమస్యలను తెచ్చిపెట్టింది. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ఈ థియేటర్లో "పుష్ప-2" బెనిఫిట్ షో సందర్భంగా పెద్ద సంఖ్యలో అభిమానులు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళ మరణించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.