Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాళ్లతో కొడతానంటే ప్రశ్నపత్రం చూపించాను... వాళ్లు ఫోటో తీసుకున్నారు : విద్యార్థిని

ఠాగూర్
సోమవారం, 24 మార్చి 2025 (14:28 IST)
పరీక్షా కేంద్రంలో కిటికీ పక్కన కూర్చొని పరీక్ష రాస్తున్న తనను కొందరు వ్యక్తులు ప్రశ్నపత్రం చూపించాలని కోరారని, అందుకు తాను అంగీకరించకపోవడంతో రాళ్ళతో కొడతానంటూ బెదిరించడంతో ప్రశ్నపత్రం చూపించానని ప్రశ్నపత్రం లీకేజీ కేసులో డీబార్‌కు గురైన విద్యార్థిని బల్లెం ఝాన్సీ లక్ష్మి వాపోతుంది. ఈ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో తనకేపాపం తెలియదని చెప్పింది. 
 
నల్గొండ జిల్లాలో పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీకి సహకరించిందన్న ఆరోపణల నేపథ్యంలో బల్లెం ఝాన్సీ లక్ష్మీ అనే విద్యార్థినిని విద్యాశాఖ అధికారులు డీబార్ చేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ, కొందరు అకతాయిలు వచ్చి కిటికీ దగ్గర పరీక్ష రాస్తున్న తనను బెదిరించి ప్రశ్నపత్రం ఫోటో తీసుకున్నారని చెప్పింది. ప్రశ్నపత్రం చూపించకుంటే రాయితో కొడతామంటూ బెదిరించారని, దీంతో తనకు ఆ సమయంలో ఏం చేయాలో అర్థంకాక ప్రశ్నపత్రం చూపించినట్టు తెలిపింది.  
 
పైగా, తన పక్క కూర్చొన్న మిగిలిన విద్యార్థులు కూడా ఏమి కాదులే చూపించు అని అన్నారని, ఈ లీకేజీలో తన ప్రమేయం ఏమాత్రం లేదని అందువల్ల తన డీబార్‌ను రద్దు చేయాలని ఆమె విజ్ఞప్తి చేసింది. ఎవరో చేసిన దానికి తనను బలిచేశారని, దయచేసి మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పించాలని కోరింది. పరీక్ష రాసేందుకు అనుమతివ్వకపోతే తాను ఆత్మహత్య చేసుకోవడం మినహా తనకు మరోమార్గం కనిపించడం లేదంటూ బోరున విలపించింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ దొంగ ముం*** కొడుకు.. వీడు మామూలోడు కాదండి: వార్నర్‌పై రాజేంద్ర ప్రసాద్ నోటిదూల (Video)

Rajendra Prasad: డేవిడ్ వార్నర్‌పై పచ్చి బూతులు: రాజేంద్ర ప్రసాద్.. మందేసి అలా మాట్లాడారా? (video)

రష్మికకు లేని నొప్పి - బాధ మీకెందుకయ్యా? మీడియాకు సల్మాన్ చురకలు!! (Video)

Devara: 28న జపాన్‌లో దేవర: పార్ట్ 1 విడుదల.. ఎన్టీఆర్‌కు జపాన్ అభిమానుల పూజలు (video)

సంబరాల యేటిగట్టు లోబ్రిటిషు గా శ్రీకాంత్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments