Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైవేటు భూమి కాదు రూ. 30 కోట్ల విలువైన ప్రభుత్వ భూమినే కబ్జా చేసేసాడు

ఐవీఆర్
శనివారం, 16 మార్చి 2024 (12:39 IST)
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని జూబ్లిహిల్స్ ప్రాంతంలో రూ. 30 కోట్ల విలువైన ప్రభుత్వ భూమినే కబ్జా చేసేసాడు ఓ ఘనుడు. తన స్థలాన్ని ఆనుకుని వున్న స్థలం కావడంతో ఎంచక్కా దాన్ని కలిపేసుకుని అందులో గదులు నిర్మించేసాడు. ఆటలు ఆడుకునేందుకు క్రీడామైదానంగా తీర్చిదిద్ది దాని చుట్టూ ప్రహరీ గోడ కూడా నిర్మించాడు. ఈ వ్యవహారం జూబ్లిహిల్స్ జర్నలిస్టు కాలనీ ఫేజ్ 1లో జరిగింది.
 
ప్రభుత్వ భూమిని కబ్జా చేసాడన్న ఫిర్యాదు అందడంతో రెవిన్యూ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఐతే ఆ స్థలం లోపలికి వెళ్లేందుకు దారి లేకపోవడంతో ముందు వున్న పురుషోత్తం రెడ్డి ఇంటి గేటు ద్వారా వెళ్లేందుకు అధికారులు ప్రయత్నించారు. దానితో తన ఇంటి ఆవరణ గేటులోపలికి వచ్చేందుకు అనుమతి నిరాకరించడంతో వారు పక్కనే వున్న కొండ ప్రాంతం పైకి ఎక్కి ఆక్రమణ జరిగిన ప్రాంతాన్ని ఫోటోలు తీసారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments