Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైవేటు భూమి కాదు రూ. 30 కోట్ల విలువైన ప్రభుత్వ భూమినే కబ్జా చేసేసాడు

ఐవీఆర్
శనివారం, 16 మార్చి 2024 (12:39 IST)
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని జూబ్లిహిల్స్ ప్రాంతంలో రూ. 30 కోట్ల విలువైన ప్రభుత్వ భూమినే కబ్జా చేసేసాడు ఓ ఘనుడు. తన స్థలాన్ని ఆనుకుని వున్న స్థలం కావడంతో ఎంచక్కా దాన్ని కలిపేసుకుని అందులో గదులు నిర్మించేసాడు. ఆటలు ఆడుకునేందుకు క్రీడామైదానంగా తీర్చిదిద్ది దాని చుట్టూ ప్రహరీ గోడ కూడా నిర్మించాడు. ఈ వ్యవహారం జూబ్లిహిల్స్ జర్నలిస్టు కాలనీ ఫేజ్ 1లో జరిగింది.
 
ప్రభుత్వ భూమిని కబ్జా చేసాడన్న ఫిర్యాదు అందడంతో రెవిన్యూ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఐతే ఆ స్థలం లోపలికి వెళ్లేందుకు దారి లేకపోవడంతో ముందు వున్న పురుషోత్తం రెడ్డి ఇంటి గేటు ద్వారా వెళ్లేందుకు అధికారులు ప్రయత్నించారు. దానితో తన ఇంటి ఆవరణ గేటులోపలికి వచ్చేందుకు అనుమతి నిరాకరించడంతో వారు పక్కనే వున్న కొండ ప్రాంతం పైకి ఎక్కి ఆక్రమణ జరిగిన ప్రాంతాన్ని ఫోటోలు తీసారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments