Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో 18 నుంచి పదో తరగతి పరీక్షలు - విద్యాశాఖ కీలక నిర్ణయం

ఠాగూర్
ఆదివారం, 17 మార్చి 2024 (13:47 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 18వ తేదీ సోమవారం నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ 2వ తేదీ వరకు జరుగుతాయి. ఈ పరీక్షల నేపథ్యంలో ఆ రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షా కేంద్రానికి ఐదు నిమిషాలు ఆలస్యంగా వస్తే లోనికి అనుమతించబోమన్న నిబంధనను ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే, ప్రశ్నపత్రంలోని ప్రతి పేజీపై హాల్ టిక్కెట్ ఖచ్చితంగా రాయాలన్న నిబంధన విధించింది.
 
కాపీయింగ్, మాస్ కాపీయింగ్ పాల్పడితే డీబార్ తప్పదని హెచ్చరించింది. కాపీయింగ్ విషయంలో సిబ్బంది పాత్ర ఉన్నా చర్యలు తప్పవని కరాఖండిగా తేల్చి చెప్పింది. ప్రశ్నపత్రం చేతికి ఇవ్వగానే విద్యార్థులు తొలుత ప్రశ్నపత్రంలోని ప్రతి పేజీపై హాల్ టిక్కెట్ నంబర్ విధిగా రాయాలని ఆదేశించింది. ప్రశ్నపత్రాలు తారుమారు కాకుండా ఉండేందుకు, కాపీయింగ్‌కు వీలు లేకుండా ఉండేందుకు వీలుగా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు, ఇప్పటివరకు అమలులో ఉన్న ఐదు నిమిషాల నిబంధనను తొలగించింది. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తామని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments