పనిమనిషి టీలో మత్తుమందు కలిపి.. ఆపై మహిళా యజమాని ఏం చేసిందో చూడండి

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (10:23 IST)
ఖమ్మం పట్టణంలో ఓ మహిళ ఇంటికి అతిథులుగా వెళ్లిన వ్యక్తులు ఆ ఇంటి పనిమనిషిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అడ్డు చెప్పాల్సిన మహిళా యజమాని ఆ తతంగాన్ని వీడియో తీసింది.

ఖమ్మం పట్టణంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. టీచర్స్‌ కాలనీకి చెందిన కాల్వ కళావతి ఇంట్లో ఓ మహిళ పనిచేస్తోంది. జనవరి 13న కళావతి ఇంటికి సయ్యద్‌ హుస్సేన్, కాల్వ రామారావు, కాల్వ సుమతి, ఉబ్బన మాణిక్యం అనే వ్యక్తులు వచ్చారు.

ఆ సమయంలో పనిమనిషి పనులన్నీ పూర్తి చేసుకుని తన ఇంటికి వెళ్తుండగా టీ తాగి వెళ్లాలని కళావతి సూచించింది. టీలో అప్పటికే మత్తు మందు కలిపారు. ఆ టీ తాగిన పనిమనిషి వెంటనే స్పృహ తప్పి పడిపోయింది. అపస్మాకర స్థితిలో ఉన్న ఆమెపై సయ్యద్‌ హుస్సేన్‌ అత్యాచారానికి పాల్పడగా కళావతి వీడియో తీసింది.
 
కాసేపటి తర్వాత తేరుకున్న బాధితురాలు తనపై జరిగిన దారుణం తెలుసుకుని కుమిలిపోయింది. ఈ విషయాన్ని బయటకు చెబితే వీడియో ఇంటర్నెట్‌లో పెడతానని బాధితురాలిని కళావతి బెదిరించింది. దీంతో పాటు రూ.5లక్షలివ్వాలంటూ బెదిరిస్తోంది.

దీంతో విసిగిపోయిన బాధితురాలు ఖమ్మం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. మహిళపై అత్యాచారానికి పాల్పడిన సయ్యద్ హుస్సేన్‌‌ను అదుపులోకి తీసుకోగా.. మిగిలిన నలుగురు పరారీలో ఉన్నారు.
 
ఈ కేసులో నిందితురాలైన కళావతి గతంలోనూ ఓ వ్యాపారికి వలపు వల వేసి బెదిరించినట్లు పోలీసులు చెబుతున్నారు. మార్కెట్‌ ఏరియాకు చెందిన వ్యాపారికి వలపు వల వేసి బెదిరించినట్లు పోలీసులు చెబుతున్నారు.

మార్కెట్‌ ఏరియాకు చెందిన వ్యాపారితో శారీరక సంబంధం పెట్టుకుని, ఏకాంత సమయంలో అతడికి తెలియకుండా వీడియోలు తీసి రూ.10లక్షలు డిమాండ్ చేసింది. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఆ వీడియోలు సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తానని బ్లాక్‌మెయిల్ చేసింది.

ఆ వ్యాపారి ఫిర్యాదుతో గతేడాది సెప్టెంబర్ నెలలో కళావతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె వలలో పట్టణానికి చెందిన మరికొందరు కూడా చిక్కుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కిలేడీ కాల్‌డేటా సేకరించిన పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శకులను సూపర్ స్టార్లు తొక్కేస్తున్నారు : కంగనా రనౌత్

Kiran: అప్పట్లో టీవీకి ఉన్న ప్రాధాన్యత నేపథ్యంగా తిమ్మరాజుపల్లి టీవీ తీశాం

గద్దర్ అవార్డ్స్ వేడుకలో గడబిడలు - నిర్వాహకులపై విమర్శలు ?

PrakashRaj: ధురంధర్-2 పై ప్రకాష్ రాజ్ విమర్శ - రామ్ గోపాల్ వర్మ ప్రశంస

మా ప్రేయసిరావే రేంజ్‌లో పిఠాపురంలో... హిట్ అవ్వాలని కోరుకుంటున్నా: శ్రీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల

GLP-1 థెరపీకి వారానికి చికిత్స ఖర్చు రూ. 325 ఖర్చు, ఎలా?

జైడస్ బహుళ-మోతాదుల పెన్ పరికరంలో సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్‌

ఎండు ద్రాక్షను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

కంటెంట్, వాణిజ్యాల సమ్మిళిత ప్రపంచంలో జీవిస్తున్నజెన్ ఆల్ఫా వెల్లడించిన ఏఎస్‌సీఐ అధ్యయనం

తర్వాతి కథనం
Show comments