సుహాసిని గెలిపించండి.. కూకట్‌పల్లి వాసులకు జగపతి బాబు విన్నపం

Webdunia
గురువారం, 22 నవంబరు 2018 (15:30 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా, హైదరాబాద్ కూకట్‌పల్లి అసెంబ్లీ స్థానం నుంచి దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి వెంకట సుహాసిని పోటీ చేస్తోంది. ఇందుకోసం ఆమె నామినేషన్ దాఖలు చేసి, ఎన్నికల ప్రచారం కూడా శ్రీకారం చుట్టారు. 
 
ఈ నేపథ్యంలో సుహాసిని టాలీవుడ్ హీరో జగపతి బాబు మద్దతు ప్రకటించారు. సుహాసిని ఎంతో నిజాయితీ కలిగిన వ్యక్తి అని, ప్రజలకు నిబద్ధతతో సేవ చేయగలదని తాను నమ్ముతున్నానని జగపతి బాబు పేర్కొన్నారు. అందువల్ల కూకట్‌పల్లి ఓటర్లు ఆమెను గెలిపించాలని ఆయన కోరారు. 
 
కాగా, సుహాసినికి మద్దతుగా టాలీవుడ్ హీరోలు నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్, నందమూరి తారక రామారావులు మద్దతు తెలిపి ప్రచారం చేయనున్నారు. అయితే, వీరి ప్రచార షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments