Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా హత్యకు కుట్ర : ఏ.రేవంత్ రెడ్డి

Webdunia
శుక్రవారం, 30 నవంబరు 2018 (09:46 IST)
తెలంగాణ ప్రదేశ్ వర్కింగ్ కమిటి (టీపీసీసీ) ఏ.రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ఆరోపణలు చేశారు. సుశిక్షితులైన పోలీసులతో తనను హత్య చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని.. అందుకోసం పోలీసులను రంగంలోకి దింపిందని ఆరోపించారు. మఫ్టీలోని పోలీసులు తనపై దాడికి పాల్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. 
 
ఇందుకు సంబంధించి తన వద్ద పూర్తి సమాచారం ఉందన్నారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్‌ మాట్లాడారు. తనకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖ, కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించినా భద్రత కల్పించకుండా కుట్ర పన్నారంటూ ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందని పదే పదే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, తీరా కోర్టు ఆదేశాలను సైతం అమలు చేయకుండా వేధిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తంచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

తర్వాతి కథనం
Show comments