Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.2కే మొబైల్ డేటా.. సీడాట్ బంపర్ ఆఫర్

Webdunia
శుక్రవారం, 30 నవంబరు 2018 (09:00 IST)
దేశంలో ఉన్న టెలికాం కంపెనీల మధ్య పోటీ తీవ్రతరమైంది. ముఖ్యంగా, రిలయన్స్ జియో సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత మొబైల్ డేటా చార్జీలు గణనీయంగా తగ్గిపోవడమేకాకుండా, అన్ని టెలికాం కంపెనీలు పోటీపడి మొబైల్ డేటాను తక్కువ ధరలకే అందుజేస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ టెలిమ్యాటిక్స్ సంస్థ (సీడాట్) బంపర్ ఆఫర్ ప్రకటించింది. సెల్‌ ఫోన్లలో అత్యవసరంగా మొబైల్ డేటా అవసరమైన పక్షంలో తక్షణం రూ.2కే మొబైల్ డేటా పొందే సౌలభ్యాన్ని కల్పిస్తుంది. 
 
ఇందుకోసం ఈ సంస్థ పబ్లిక్ డేటా ఆఫీస్ (పీడీఓ) వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఈ వ్యవస్థ ద్వారా రూ.2 నుంచి రూ.20 వరకు డేటా అవసరమనుకున్న వారికి క్షణాల్లో అందుతుంది. ఈ సేవలను గురువారం దేశ ఐటీ రాజధాని బెంగుళూరులో ప్రారంభించారు. ఈ మొబైల్ డేటా పొందేందుకు పబ్లిక్ ఎలక్ట్రానిక్ ఆఫీస్ (పీఈఓ)లను ఏర్పాటు చేయనుంది. వీటిని ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటుచేస్తారు.
 
ఈ పీఈఓలలో రూ.2 నాణెం వేయదగినట్టుగా కాయిన్ బూత్ వంటి పరికరం ఉంటుంది. ఇందులో రూ.2 నాణెం వేసి మొబైల్ నంబరును ఎంటర్ చేసినట్టయితే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అందులో ఎటర్ చేస్తే ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ విధానం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్యలతో పాటు తక్కువ ధరలకే డేటాను అందివ్వనున్నట్టు సీడాట్ కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

Miheeka : పెళ్ళీడుకొచ్చిన శ్రీలీలకు మిహీక రానా శుభాకాంక్షలు

ద్విభాషా చిత్రంలో కీలక పాత్రలో అమ్ము అభిరామి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments