Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.2కే మొబైల్ డేటా.. సీడాట్ బంపర్ ఆఫర్

Webdunia
శుక్రవారం, 30 నవంబరు 2018 (09:00 IST)
దేశంలో ఉన్న టెలికాం కంపెనీల మధ్య పోటీ తీవ్రతరమైంది. ముఖ్యంగా, రిలయన్స్ జియో సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత మొబైల్ డేటా చార్జీలు గణనీయంగా తగ్గిపోవడమేకాకుండా, అన్ని టెలికాం కంపెనీలు పోటీపడి మొబైల్ డేటాను తక్కువ ధరలకే అందుజేస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ టెలిమ్యాటిక్స్ సంస్థ (సీడాట్) బంపర్ ఆఫర్ ప్రకటించింది. సెల్‌ ఫోన్లలో అత్యవసరంగా మొబైల్ డేటా అవసరమైన పక్షంలో తక్షణం రూ.2కే మొబైల్ డేటా పొందే సౌలభ్యాన్ని కల్పిస్తుంది. 
 
ఇందుకోసం ఈ సంస్థ పబ్లిక్ డేటా ఆఫీస్ (పీడీఓ) వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఈ వ్యవస్థ ద్వారా రూ.2 నుంచి రూ.20 వరకు డేటా అవసరమనుకున్న వారికి క్షణాల్లో అందుతుంది. ఈ సేవలను గురువారం దేశ ఐటీ రాజధాని బెంగుళూరులో ప్రారంభించారు. ఈ మొబైల్ డేటా పొందేందుకు పబ్లిక్ ఎలక్ట్రానిక్ ఆఫీస్ (పీఈఓ)లను ఏర్పాటు చేయనుంది. వీటిని ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటుచేస్తారు.
 
ఈ పీఈఓలలో రూ.2 నాణెం వేయదగినట్టుగా కాయిన్ బూత్ వంటి పరికరం ఉంటుంది. ఇందులో రూ.2 నాణెం వేసి మొబైల్ నంబరును ఎంటర్ చేసినట్టయితే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అందులో ఎటర్ చేస్తే ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ విధానం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్యలతో పాటు తక్కువ ధరలకే డేటాను అందివ్వనున్నట్టు సీడాట్ కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments