Webdunia - Bharat's app for daily news and videos

Install App

పారిస్ ఒలింపిక్స్ : భారత్ ఖాతాలో మరో పతకం ఖాయం!!

వరుణ్
బుధవారం, 7 ఆగస్టు 2024 (09:54 IST)
పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ మహిళల 50 కేజీల ప్రీస్టైల్‌ ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరింది. ఫలితంగా స్వర్ణ పతకానికి ఓ అడుగు దూరంలో నిలిచింది. 
 
సెమీఫైనల్లో క్యూబా రెజ్లర్ యుస్నీలిస్ గుజ్మన్‌‌తో జరిగిన బౌట్ లో 5-0తో విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఆరంభం నుంచే ఫొగాట్ ఆధిపత్యం ప్రదర్శించింది. ప్రత్యర్థి నుంచి పెద్దగా ప్రతిఘటన లేకపోవడంతో తొలి పిరియడ్ ముగిసే సమయానికి పొగాట్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో పీరియడ్‌లో ఆమె 5-0తో భారీ ఆధిక్యాన్ని సాధించింది. ఈ ఆధిక్యాన్ని చివరి వరకు అలాగే కొనసాగించడంతో బౌట్ భారత వశమైంది.
 
ఇక స్వర్ణ కోసం జరిగే ఫైనల్ పోరులో అమెరికాకు చెందిన సారా హిల్డర్ బ్రాంట్‌తో వినేశ్ ఫోగాట్ తలపడనుంది. హిల్డర్ బ్రాంట్ సెమీఫైనల్లో మంగోలియాకు చెందిన డోల్గోర్ఖావిన్పై విజయం సాధించి ఫైనల్ చేరుకుంది. ఒలింపిక్స్ క్రీడల్లో రెజ్లింగ్ విభాగంలో ఫైనల్లో పతకం అందించనున్న తొలి భారతీయ మహిళ వినేశ్ ఫొగాట్ నిలవడం ఖాయమైంది. సెమీస్‌కు చేరిన తొలి మహిళగా ఇప్పటికే రికార్డు సృష్టించారు. కాగా 2016 ఒలింపిక్స్ క్వార్టర్స్ ఓడిపోయిన సాక్షి మాలిక్ కాంస్యం పతకంతో సరిపెట్టుకున్న విషయం తెల్సిందే. 
 
ఇదిలావుంటే, ఇక స్వర్ణ కోసం జరిగే ఫైనల్ పోరులో అమెరికాకు చెందిన సారా హిల్డర్ బ్రాంట్ తో వినేశ్ ఫోగాట్ తలపడనుంది. హిల్డర్ బ్రాంట్ సెమీఫైనల్లో మంగోలియాకు చెందిన డోల్గోర్ఖావిన్‌పై విజయం సాధించి ఫైనల్ చేరుకుంది. కాగా వినేశ్ ఫోగాట్ రౌండ్-16 బౌట్‌లో నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన జపాన్ క్రీడాకారిణి యుయి సుసాకిని ఆశ్చర్యకర రీతిలో మట్టికరిపించింది. 
 
సుసాకి ఒక అంతర్జాతీయ ఈవెంట్లో ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఆమె ఆడిన 82 బౌట్లు అన్నింటిలో విజయం సాధించింది. అలాంటి ప్రత్యర్థిని వినేశ్ ఓడించి సంచలనం సృష్టించింది. అద్భుతమైన ప్రదర్శన కనపరిచింది. ఆరంభంలో 0-2తో వెనుకబడినప్పటికీ.. చివరి 3-2తో బౌట్ను గెలుచుకుంది. ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్స్ ఉక్రెయిన్ క్రీడాకారిణి ఒక్సానా లివాడ్‌పై 7-5 తేడాతో పొగాట్ విజయం సొంతం చేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైఎస్ ఫ్యామిలీ కోసం ఇంతకాలం భరించా.. కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి : బాలినేని

తిరుమల లడ్డూ ప్రసాదంపై ప్రమాణం చేద్దామా: వైవీ సుబ్బారెడ్డికి కొలికిపూడి సవాల్

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

తర్వాతి కథనం
Show comments