Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరులో మ్యాచ్.. గొడవకు దిగిన ఇండో-పాక్ ఆటగాళ్లు

Webdunia
గురువారం, 22 జూన్ 2023 (10:41 IST)
Foot Ball
దక్షిణాసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ ఛాంపియన్‌షిప్ సిరీస్ బెంగళూరులో ప్రారంభమైంది. ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. ఇందులో భారత్ సహా 8 జట్లు పాల్గొంటున్నాయి. వీటిని రెండు వర్గాలుగా విభజించారు. భారత్, కువైట్, నేపాల్, పాకిస్థాన్‌లు 'ఎ' కేటగిరీలో నిలిచాయి. గ్రూప్ 'బి'లో బంగ్లాదేశ్, భూటాన్, లెబనాన్, మాల్దీవులు ఉన్నాయి. 
 
ఈ నేపథ్యంలో బెంగళూరులోని శ్రీ కండిరవ స్టేడియంలో టీమిండియా తన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడింది. ఆట ప్రారంభం నుంచే భారత జట్టు ఆధిపత్యం ప్రదర్శించింది. ఆట 10వ నిమిషంలో భారత జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి గోల్ చేశాడు. 
 
ఫలితంగా భారత జట్టు ముందంజ వేసింది. కాగా, మ్యాచ్ ప్రథమార్థం చివరి నిమిషాల్లో భారత్, పాక్ ఆటగాళ్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మైదానంలో, భారత ప్రధాన కోచ్ ఇగోర్ స్టిమాక్ ఇక్బాల్‌ను త్రో-ఇన్ తీసుకోకుండా అడ్డుకున్నాడు. అతని చేతి నుండి బంతిని పడగొట్టాడు. దీంతో ఇరువర్గాల ఆటగాళ్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 
 
అనంతరం ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తోపులాట జరిగింది. దీనిపై పాకిస్థాన్ చీఫ్ కోచ్ షాజాద్ అన్వర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మ్యాచ్ అధికారులు జోక్యం చేసుకుని ఆటగాళ్లను శాంతింపజేసి ఆటను పున:ప్రారంభించారు.
 
దీంతో స్టిమాక్‌కి రెడ్‌కార్డు, పాకిస్థాన్ మేనేజర్ షాజద్ అన్వర్‌కు ఎల్లో కార్డ్‌ పడింది. ఈ మ్యాచ్ ముగిసే సమయానికి పాకిస్థాన్‌ను 4-0తో ఓడించి భారత జట్టు విజయం సాధించడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్‌ కల్యాణ్‌కు బీజేపీ రోడ్‌ మ్యాప్‌ ఇచ్చేసిందా?

భర్తే అత్యాచారం చేస్తే నేరమా? కాదా? - పార్లమెంటులోనే నిర్ణయిస్తామని కేంద్రం కోర్టుకు ఎందుకు చెప్పింది

లడ్డూ కల్తీ అయిందా.. ఎక్కడ? సిట్ ఎందుకు.. బిట్ ఎందుకు? జగన్ ప్రశ్న (Video)

హైదరాబాదులో సైబర్ మోసగాళ్లు.. రూ.10.61 కోట్లు కోల్పోయిన వృద్ధ జంట

తెలంగాణ సీఎం రేవంతన్నకు బహిరంగ లేఖ రాసిన కేవీపీ ఎందుకు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

35 చిన్న కథ కాదు ప్రొడ్యూసర్ కాల్ చేసి జెలసీగా వుందన్నారు : శ్వాగ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్

ఆస్పత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్... ప్రధాని మోడీకి ధన్యవాదాలు

తర్వాతి కథనం
Show comments