Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరులో మ్యాచ్.. గొడవకు దిగిన ఇండో-పాక్ ఆటగాళ్లు

Webdunia
గురువారం, 22 జూన్ 2023 (10:41 IST)
Foot Ball
దక్షిణాసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ ఛాంపియన్‌షిప్ సిరీస్ బెంగళూరులో ప్రారంభమైంది. ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. ఇందులో భారత్ సహా 8 జట్లు పాల్గొంటున్నాయి. వీటిని రెండు వర్గాలుగా విభజించారు. భారత్, కువైట్, నేపాల్, పాకిస్థాన్‌లు 'ఎ' కేటగిరీలో నిలిచాయి. గ్రూప్ 'బి'లో బంగ్లాదేశ్, భూటాన్, లెబనాన్, మాల్దీవులు ఉన్నాయి. 
 
ఈ నేపథ్యంలో బెంగళూరులోని శ్రీ కండిరవ స్టేడియంలో టీమిండియా తన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడింది. ఆట ప్రారంభం నుంచే భారత జట్టు ఆధిపత్యం ప్రదర్శించింది. ఆట 10వ నిమిషంలో భారత జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి గోల్ చేశాడు. 
 
ఫలితంగా భారత జట్టు ముందంజ వేసింది. కాగా, మ్యాచ్ ప్రథమార్థం చివరి నిమిషాల్లో భారత్, పాక్ ఆటగాళ్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మైదానంలో, భారత ప్రధాన కోచ్ ఇగోర్ స్టిమాక్ ఇక్బాల్‌ను త్రో-ఇన్ తీసుకోకుండా అడ్డుకున్నాడు. అతని చేతి నుండి బంతిని పడగొట్టాడు. దీంతో ఇరువర్గాల ఆటగాళ్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 
 
అనంతరం ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తోపులాట జరిగింది. దీనిపై పాకిస్థాన్ చీఫ్ కోచ్ షాజాద్ అన్వర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మ్యాచ్ అధికారులు జోక్యం చేసుకుని ఆటగాళ్లను శాంతింపజేసి ఆటను పున:ప్రారంభించారు.
 
దీంతో స్టిమాక్‌కి రెడ్‌కార్డు, పాకిస్థాన్ మేనేజర్ షాజద్ అన్వర్‌కు ఎల్లో కార్డ్‌ పడింది. ఈ మ్యాచ్ ముగిసే సమయానికి పాకిస్థాన్‌ను 4-0తో ఓడించి భారత జట్టు విజయం సాధించడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

19 ఏళ్ల కుర్రాడిని తీసుకుని 38 ఏళ్ల మహిళ జంప్, ఇద్దరూ బెంగళూరులో...

YS Viveka Case: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన వైఎస్ సునీతారెడ్డి.. ఈ కేసు క్లోజ్ కాకపోతే?

Midhun Reddy: ఏపీ మద్య కుంభకోణం-బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డి పిటిషన్

జగన్ ఆ విషయంలో నిష్ణాతుడు.. లిక్కర్ స్కామ్‌పై సమాధానం ఇవ్వాలి.. వైఎస్ షర్మిల

జూలై 26 నుంచి 31 వరకు సింగపూర్‌లో చంద్రబాబు పర్యటన.. ఎలా సాగుతుందంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

తర్వాతి కథనం
Show comments