Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫుట్‌బాల్ దిగ్గజం శ్యామ్ థాపాకు కరోనా

Webdunia
బుధవారం, 7 ఏప్రియల్ 2021 (16:32 IST)
భారత ఫుట్‌బాల్ దిగ్గజం, ఆలిండియా ఫుడ్‌బాల్ ఫెడరేషన్ సాంకేతిక విభాగం చైర్మన్ శ్యామ్ థాపా కరోనా బారిన పడ్డారు. తనకు సోమవారం కొవిడ్-19 పాజిటివ్ అని తేలిందనీ... నిన్న సాయంత్రం స్వయంగా ఆస్పత్రికి వెళ్లి అడ్మిట్ అయ్యానని ఆయన వెల్లడించారు.

''నాకు రుచి తెలియడం లేదు. ఆకలి కూడా మందగించింది. కరోనా టెస్ట్ చేయించడంతో పాజిటివ్ అని తెలిసింది. ముందస్తు జాగ్రత్తగా ఆస్పత్రిలో చేరాను. ప్రస్తుతం నా పరిస్థితి బాగానే ఉంది...'' అని థాపా వెల్లడించారు. కాగా థాపా గత నెల 20న కొవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. 73 ఏళ్ల ఆయన బైసైకిల్ కిక్, బ్యాక్ వ్యాలీలతో ప్రఖ్యాతి చెందారు. 
 
1960ల్లోనూ, 70వ దశకం మొదట్లోనూ ఈస్ట్ బెంగాల్ తరుపున ఆడారు. 1977లో మొహున్ బేగన్ తరుపున ఆడారు. 1970లో మెర్డెకా టోర్నమెంట్, బ్యాంకాక్ ఏసియన్ గేమ్స్‌లో భారత్‌కు కాంస్య పతకం గెలుచుకునేందుకు కీలక పాత్ర పోషించారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments