Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌పై సానియా మీర్జా కీలక వ్యాఖ్యలు.. ఐపీఎల్ స్ఫూర్తిగా అవి ఏర్పడ్డాయి?

Webdunia
బుధవారం, 7 ఏప్రియల్ 2021 (11:48 IST)
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఐపీఎల్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. ఐపీఎల్ కేవలం డబ్బుకోసమేనా? అభిమానులకు ఎంటర్‌టైన్‌మెంట్ అందించడం తప్ప ఇంకేమీ చేయలేదా అంటే కాదనే అంటోంది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ డెవెలెప్‌మెంట్ అండ్ పీస్ సందర్భంగా పార్లమెంటరీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ నిర్వహించిన వర్చువల్ ప్యానల్ చర్చలో సానియా మీర్జా పాల్గొని క్రీడలకు సంబంధించిన విషయాలు వివరించింది.
 
ఇంకా ఆమె మాట్లాడుతూ.. ఐపీఎల్ ద్వారా ఎంతో ప్రతిభ వెలుగులోకి వస్తుంది.. గ్రామీణ, పట్టణ ప్రాంత క్రీడాకారులకు ఇది ఒక మంచి వేదికను కల్పిస్తుందని సానియా చెప్పింది. వేర్వేరు సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన క్రీడాకారులు ప్రపంచంలోని మేటీ క్రికెటర్లతో కలసి ఆడేందుకు, వారితో పోటీ పడేందుకు బీసీసీఐ మంచి వేదికను కల్పించిందని సానియా ప్రశంసించింది. 
 
ఇక ఐపీఎల్‌ను స్పూర్తిగా తీసుకొనే బ్యాడ్మింటన్ లీగ్, కబడ్డీ లీగ్, టెన్నిస్ లీగ్, హాకీ లీగ్, ఫుట్‌బాల్ లీగ్ వంటివి ఏర్పడ్డాయి. దీని ద్వారా ఎంతో మంది తమ ప్రతిభను ప్రపంచానికి చాటగలుగుతున్నారని సానియా చెప్పింది. 'పరాజయం నుంచి ఎలా తేరుకోవాలి.. ఎలా పైకి రావాలో ఆటలు నేర్పిస్తాయి. ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకోగల ధైర్యం క్రీడల వల్లే సాధ్యమవుతుంది' అని సానియా మీర్జా వివరించింది.

సంబంధిత వార్తలు

పోలీస్ ఏసీపీ నివాసంలో ఏసీబీ సోదాలు.. ఆదాయానికిమించిన కేసులో ఏసీపీ అరెస్టు!

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

తర్వాతి కథనం
Show comments