Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరీరం సహకరించడం లేదంటూ సంచలన ప్రకటన చేసిన సానియా మీర్జా

Webdunia
బుధవారం, 19 జనవరి 2022 (16:19 IST)
భారత టెన్నిస్ స్టార్, హైదరాబాద్ ఏస్ సానియా మీర్జా సంచలన ప్రకటన చేశారు. టెన్నిస్ ఆడేందుకు శరీరం సహకరించడం లేదని వ్యాఖ్యానించారు. పైగా, ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్‌ సీజన్‌ చివరిదన్న సంకేతాలను ఆమె వెల్లడించారు. ప్రస్తుత సీజన్ తర్వాత రిటైర్ అవుతున్నట్టు ప్రకటించారు. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో పాల్గొనబోతున్నట్టు తెలిపారు. ఉమెన్స్ డబుల్స్ విభాగంలో ఉక్రెయిన్‌కు చెందిన నదియా కిచెనోక్‌తో కలిసి ఈ టోర్నీలో పాల్గొంది. అయితే, తొలి రౌండ్‌లోనే ఓటమి పాలైంది. 
 
ఆ తర్వాత ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తన టెన్నిస్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్నట్టు ప్రకటించారు. "ఒకే.. నేను ఇకపై ఆడబోవడం లేదు" అని సింపుల్‌గా చెప్పలేనని చెప్పారు. టెన్నిస్ ఆడటం కోసం తన మూడేళ్ళ కుమారుడితో కలిసి తాను సుధీర్ఘ ప్రయాణాలు చేయాల్సి వస్తుందని, చిన్నారిని ఇబ్బంది పెట్టలేనని సోనియా చెప్పుకొచ్చారు. 
 
పైగా, తన శరీరం కూడా ఇంతకుముందులా సహకరించడం లేదని చెప్పారు. ఈ రోజున తన మోకాలు చాలా ఇబ్బంది పెట్టిందని అయితే, ఈనాటి ఓటమికి ఇదే కారణమని తాను చెప్పడం లేదని వ్యాఖ్యానించారు. అయితే, ఈ సీజన్ చివరివరకు ఆడాలని భావిస్తున్నానని, ఆ తర్వాత ఆటలో కొనసాగడం అసాధ్యమని సానియా స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

దేశంలో జమిలి ఎన్నికలు తథ్యం.. అమలుకు ప్రత్యేక కమిటీ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ముంబై నటినే కాదు.. ఆమె సోదరుడిని కూడా వేధించిన పీఎస్ఆర్ ఆంజనేయులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

తర్వాతి కథనం
Show comments