Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోరాడి ఓడిన పీవీ సింధు : కాంస్య పతకం కోసం చివరి ఆట

Webdunia
శనివారం, 31 జులై 2021 (17:22 IST)
టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు మరో నిరాశాజనకమైన ఫలితం ఎదురైంది. స్వర్ణం పతకం సాధిస్తుందని కోటి ఆశలు పెట్టుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సెమీఫైనల్లో ఓటమిపాలైంది. వరల్డ్ నెంబర్ తై జు యింగ్ (చైనీస్ తైపే)తో శనివారం మధ్యాహ్నం జరిగిన పోరులో సింధు 18-21, 12-21తో పరాజయం పాలైంది. 
 
నువ్వే నేనా అన్న‌ట్లుగా ప్ర‌తి పాయింట్ కోసం పోరాడారు. మ‌ళ్లీ స్కోర్ 16-16కు చేరుకున్న‌ది. తొలి గేమ్‌ను తైజు యింగ్ 21-18 స్కోర్ తేడాతో 21 నిమిషాల్లో సొంతం చేసుకుంది. 
 
నిజానికి తొలి గేమ్‌లో పోరాడిన సింధు, రెండో గేమ్ ఆరంభంలో ఫర్వాలేదనిపించినా, ఆపై క్రమేణా మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. శక్తిమంతమైన షాట్లు, తెలివైన క్రాస్ కోర్టు ఆటతీరుతో తై జు యింగ్ మ్యాచ్‌ను తన వశం చేసుకుంది. 
 
ఇక సింధు రేపు కాంస్యం కోసం జరిగే మ్యాచ్‌లో ఆడనుంది. 2016లో రియో ఒలింపిక్స్‌లో సిల్వ‌ర్ సాధించిన సింధు.. టోక్యోలో మాత్రం కాంస్య ప‌త‌కం కోసం పోటీప‌డ‌నున్న‌ది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments