Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2022-ఢిల్లీకి కష్టాలు.. నలుగురు క్రికెటర్లకు కరోనా

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (15:44 IST)
ఐపీఎల్ 2022లో కరోనా కలకలం రేపుతోంది. నలుగురు క్రికెటర్లకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఢిల్లీ జట్టుకు కష్టాలు తప్పేలా లేవు.  ఇప్పటికే ఢిల్లీ ఫిజియో ప్యాట్రిక్‌ ఫార్‌హర్ట్‌ పాజిటివ్‌గా తేలడంతో ఈ సీజన్‌లో తొలి కేసు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. 
 
ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్‌ మార్ష్‌ కూడా సోమవారం ఆసుపత్రి పాలయ్యారు. ప్యాట్రిక్‌, మార్ష్‌ కాకుండా జట్టు డాక్టర్‌ అభిజిత్‌ సాల్వి, మసాజర్‌ కూడా పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. మార్ష్‌ కాకుండా మిగతా ఆటగాళ్లందరికీ రెండు ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లోనూ నెగెటివ్‌గా వచ్చింది. దీంతో బుధవారం పంజాబ్‌తో ఢిల్లీ మ్యాచ్‌ను యధావిధిగా నిర్వహించాలని బిసిసిఐ నిర్ణయించింది. 
 
''మార్ష్‌కు తొలి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో నెగెటివ్‌ వచ్చింది. కానీ రెండో పరీక్షలో పాజిటివ్‌ వచ్చింది. మిగతా ఆటగాళ్లందరూ రెండు పరీక్షల్లోనూ నెగెటివ్‌గా తేలారు. ఢిల్లీ -పంజాబ్‌ మ్యాచ్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు'' అని ఓ సీనియర్‌ బిసిసిఐ అధికారి తెలిపారు.
 
వివిధ జట్లలోని ఆటగాళ్లకు కరోనా సోకడంతో గతేడాది భారత్‌లో టోర్నీని వాయిదా వేసి.. అనంతరం సెప్టెంబర్‌- అక్టోబర్‌ మధ్యలో యుఎఇలో నిర్వహించిన సంగతి తెలిసిందే.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్య కళ్ళలో కారం చల్లాడు.. పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు.. జీవితఖైదు

Maharashtra: ఫోన్ చూసుకుంటున్న తండ్రి, నాలుగేళ్ల బాలుడిపై ఎక్కి దిగిన కారు.. ఎక్కడ? (video)

195 ఎర్రచందనం దుంగల స్వాధీనం.. పోలీసులను అభినందించిన డిప్యూటీ సీఎం పవన్

తిరుమల నందకం అతిథి గృహంలో దంపతుల ఆత్మహత్య.. చీరతో ఉరేసుకుని?

ఫిబ్రవరి 24న ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

తర్వాతి కథనం
Show comments