Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూపర్ సిరీస్ టోర్నీలో పీవీ సింధు ఓటమి

Webdunia
ఆదివారం, 21 జులై 2019 (17:01 IST)
ఇండోనేషియా సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ ఫైనల్లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఓటమిపాలైంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ టైటిల్‌ పోరులో సింధుపై 15-21, 16-21 తేడాతో నాలుగో సీడ్‌, జపాన్‌ షట్లర్‌ అకానె యమగూచి విజయం సాధించింది. 
 
ఈ మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన యమగూచి వరుస గేముల్లో ఆధిపత్యం చెలాయించి సింధును చిత్తుచేసింది. రెండు గేముల్లో ఆఖర్లో పాయింట్లు సాధించిన యమగూచి సింధుపై ఒత్తిడి పెంచి ఆధిక్యం సాధించింది. 
 
కాగా, ఈ సీజన్‌లో సూపర్‌ సిరీస్‌ ఫైనల్లో సింధు ప్రవేశించడం ఇదే తొలిసారి. 2019లో ఓ అంతర్జాతీయ టోర్నీలో తొలి టైటిల్‌ సాధించాలనుకున్న సింధు కల నెరవేరలేదు. 
 
ముఖ్యంగా, సెమీస్‌లో ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌ చెన్‌ యుఫీని వరుస గేముల్లో చిత్తు చేసిన సింధు.. ఫైనల్లో ఈజీగానే గెలుస్తుందని అనుకున్నారంతా!. ఆద్యంతం ఏక‌ప‌క్షంగా సాగిన తుదిపోరులో జ‌పాన్ అమ్మాయి టైటిల్ నెగ్గింది. దీంతో ఆమె రన్నరప్‍గా నిలవాల్సివచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NISAR: శ్రీహరికోటలో జీఎస్ఎల్‌వీ-F16తో నిసార్ ప్రయోగానికి అంతా సిద్ధం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి.. చంద్రబాబు, జగన్ సంతాపం

రన్ వేపై విమానం ల్యాండ్ అవుతుండగా అడ్డుగా మూడు జింకలు (video)

Rickshaw: 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన రిక్షావాడు అరెస్ట్

వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేస్తాం.. నారాయణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

తర్వాతి కథనం
Show comments