విరాట్ కోహ్లీ సారథ్యంలోనే భారత క్రికెట్ జట్టు కరేబియన్ దీవుల్లో పర్యటించనుంది. ఈ పర్యటన కోసం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఆదివారం మూడు ఫార్మెట్లకు జట్టును ఎంపిక చేసింది. ఈ పర్యటనలో భారత జట్టు మూడు ట్వంటీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్లను ఆడనుంది. ఈ పర్యటన వచ్చే నెల మూడో తేదీ నుంచి ప్రారంభంకానుంది.
ఈ పర్యటన కోసం జట్టును ప్రకటించారు. ఇందులో గత ప్రపంచ కప్ టోర్నీ నుంచి అర్థాంతరంగా వైదొలిగిన ఓపెనర్ శిఖర్ ధావన్ టీ20, వన్డే జట్లలో చోటు దక్కించుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో మహేంద్రసింగ్ ధోనీ స్థానంలో రిషబ్ పంత్ను వికెట్ కీపర్గా ఎంపిక చేశారు. ఈ టోర్నీకి తనను ఎంపిక చేయొద్దంటూ ధోనీ వినతి మేరకు ఆయన్ను పక్కనబెట్టేశారు. కాగా మూడు ఫార్మెట్లకు ప్రకటించిన జట్లు వివరాలను పరిశీలిస్తే,