Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిస్కస్ త్రోలో భారత్‌కు మరో పతకం : మెరిసిన యోగేష్

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (10:12 IST)
టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ పోటీల్లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఆదివారం మూడు పతకాలను సాధించిన భారత ఆటగాళ్లు సోమవారం మరో రెండు పతకాలను తమ ఖాతాలో వేసుకున్నారు. వీటిలో ఒకటి బంగారం పతకం కావడం గమనార్హం. రెండోది రజత పతకం. 
 
సోమవారం భారత షూటర్ అవనీ లేఖర దేశానికి తొలి స్వర్ణ పతకం అందించగా, తాజాగా డిస్కస్‌త్రోలో యోగేశ్ కతునియా పురుషుల డిస్కస్ త్రో ఎఫ్56లో రజత పతకం అందించాడు. 44.38 మీటర్లు విసిరి ఈ సీజన్‌లోనే బెస్ట్ సాధించాడు. 
 
24 ఏళ్ల యోగేశ్ ఈ కేటగిరీలో ప్రపంచ నంబర్ 2గా కొనసాగుతున్నాడు. బ్రెజిల్ క్రీడాకారుడు క్లాడినే బటిస్టా 45.59 మీటర్లు విసిరి స్వర్ణం కైవసం చేసుకున్నాడు.
 
అలాగే, జావెలిన్ త్రో ఎఫ్ 46 విభాగంలో భారత్‌కు రెండు పతకాలు దక్కాయి. దేవేంద్ర జజారియా రజత పతకం గెలుచుకోగా, సుందర్ సింగ్ గుర్జార్ కాంస్య పతకంతో మెరిశాడు. దీంతో పారాలింపిక్స్‌లో భారత్‌కు ఆరు పతకాలు సొంతమయ్యాయి. 
 
కాగా, ఆదివారం డిస్కస్ త్రోలో వినోద్ కుమార్ మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించినప్పటికీ ఈ విషయంలో సోమవారం సాయంత్రానికి స్పష్టత రానుంది. ఇది కూడా కలిస్తే భారత్ సాధించిన పతకాల సంఖ్య ఏడుకు చేరుకున్నట్టే. పారాలింపిక్స్‌లో భారత్ ఇన్ని పతకాలు సాధించడం ఇదే తొలిసారి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఘోరం, పడవ ప్రమాదంలో 78 మంది జల సమాధి, 148 మంది మిస్సింగ్- Live video

సనాతన ధర్మాన్ని ఎవరూ నిర్మూలించలేరన్న పవన్ - వెయిట్ అండ్ సీ అంటున్న ఉదయనిధి...

లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్ ఏర్పాటు : స్వాగతించిన సీఎం చంద్రబాబు

చంద్రబాబు ఏం చెబితే సీబీఐ అదే చెబుతుంది: పేర్ని నాని పాత వీడియో వైరల్

హైడ్రాపై కేఏ పాల్‌ పిటిషన్‌.. ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోక్షజ్ఞ తొలి సినిమాకు రూ.100 కోట్ల బడ్జెట్ అవసరమా?

రూ.200 క్లబ్ లో చేరిన త్రిష.. లియో.. గోట్ ఆమె దశ తిరిగిపోయిందిగా..

నచ్చితే బలగం సినిమాలో ప్రోత్సహించండి. నచ్చకపోతే... : దిల్ రాజు

ఆ దర్శకుడు మా కుటుంబ సభ్యుడిగా మారారు : జూనియర్ ఎన్టీఆర్

మలయాళ విలన్ నటుడు మోహన్ రాజ్ ఇకలేరు...

తర్వాతి కథనం
Show comments