Webdunia - Bharat's app for daily news and videos

Install App

టోక్యో ఒలింపిక్స్‌: సెమీస్‌లో ఓడిన భారత మహిళల హాకీ జట్టు

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (17:43 IST)
Hockey
టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళా హాకీ జట్టుకు ఇబ్బందులు తప్పట్లేదు. రాణి రాంపాల్‌ సేన చివరి వరకూ గెలుపు కోసం పోరాడినా ఓటమి తప్పలేదు. సెమీస్‌లో ప్రపంచ నంబర్‌ వన్‌ జట్టు అర్జెంటీనాతో బుధవారం తలపడి 2-1 తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఒలింపిక్స్‌లో తొలిసారిగా ఫైనల్‌ చేరే అవకాశాన్ని కోల్పోయింది. ఇక కాంస్య పకతం కోసం జరిగే పోరులో తలపడనుంది. 
 
కీలకమైన సెమీస్‌లో భారత మహిళల హాకీ జట్టు ఆఖరి నిమిషం వరకు విజయం కోసం ప్రయత్నించినా.. ప్రత్యర్థి జట్టు తమ అనుభవంతో ఆ ప్రయత్నాలను అడ్డుకొంది. భారత్‌ నుంచి గుర్జీత్‌ కౌర్‌ గోల్‌ చేయగా.. అర్జెంటీనాలో మరియా నోయెల్‌ 2 గోల్స్‌ చేసింది. 
 
ఇక కాంస్యం కోసం భారత్‌ బ్రిటన్‌తో తలపడనుంది. బ్రిటన్‌ జట్టు మొదటి సెమీ ఫైనల్‌లో నెదర్లాండ్స్‌ చేతిలో 5-1 తేడాతో ఓడిపోయింది. కాంస్యం కోసం నెదర్లాండ్స్‌, అర్జెంటీనా తలపడనున్నాయి. భారత పురుషుల హాకీ జట్టు కూడా సెమీఫైనల్‌లో ఓడిపోయిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వర్షిణిని పెళ్లాడిన లేడీ అఘోరి - వీడియో ఇదిగో...

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అనారోగ్యం.. కేబినేట్ సమావేశాల సంగతేంటి?

వృద్ధుడికి పునర్జన్మనిచ్చిన మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు!!

అద్దె విషయంలో జగడం.. వృద్ధురాలిని హత్య చేసి మృతదేహంపై యువకుడు డ్యాన్స్

గుంటూరులో చిన్న షాపు.. ఆమెతో మాట్లాడిన చంద్రబాబు.. ఎందుకు? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో సమంత రీ ఎంట్రీ గ్రాండ్‌గా వుండబోతోంది.. చెర్రీ, పుష్పలతో మళ్లీ రొమాన్స్!?

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

తర్వాతి కథనం
Show comments