Webdunia - Bharat's app for daily news and videos

Install App

పారిస్ ఒలింపిక్స్.. భారత హాకీ జట్టుకు నగదు వర్షం

ఠాగూర్
శుక్రవారం, 9 ఆగస్టు 2024 (08:34 IST)
పారిస్ కేంద్రంగా సాగుతున్న ఒలింపిక్ క్రీడా పోటీల్లో భారత పురుషుల హాకీ జట్టు పతకం సాధించింది. 52 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వరుసగా రెండవ ఒలింపిక్స్‌లో పతకం సాధించింది. దీంతో జట్టుకు హాకీ ఇండియా నగదు బహుమతి ప్రకటించింది. పారిస్ ఒలింపిక్స్ 2024లో కాంస్యం సాధించిన జట్టులోని ప్రతి ఆటగాడికి రూ.15 లక్షలు చొప్పున నగదు బహుమతి అందించనున్నట్టు వెల్లడించింది. ఇక జట్టులోని సహాయక సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.7.5 లక్షలు అందచేస్తామని తెలిపింది. 
 
కాగా గురువారం జరిగిన కాంస్య పతక పోరులో స్పెయిన్‌పై భారత హాకీ జట్టు 2-1 తేడాతో చారిత్రాత్మక విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో 52 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వరుసగా రెండవ ఒలింపిక్స్‌లో భారత జట్టు పతకాన్ని ముద్దాడినట్టయింది. 
 
పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతకాన్ని సాధించిన జట్టుపై హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ ప్రశంసల జల్లు కురిపించారు. ఆటగాళ్లను మెచ్చుకున్నారు. వరుసగా రెండో ఒలింపిక్‌లోనూ పతకం గెలవడం అసాధారణమైన విజయమని కొనియాడారు. ఈ నగదు బహుమతి క్రీడాకారులు ప్రయత్నాలకు ఒక ప్రశంస మాత్రమేనని దిలీప్ టిర్కీ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

15 ఏళ్ల తర్వాత కలిశాం.. ఇంతలో ఆ నలుగురు మృతి.. డీఎన్ఏ కోసం వేచి చూస్తున్నాం

భార్య చివరి కోరికను తీర్చాడు.. కానీ తిరిగి రాని లోకాలకు చేరాడు.. ఇద్దరు కుమార్తెలు?

Tirumala Laddu : తిరుమల లడ్డూ ప్రసాదం తింటుంటే నాలుకకు గాయమైందట!

South Africa: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులను ఖండించిన దక్షిణాఫ్రికా.. శాంతించండి..

Telangana: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 571 కొత్త పాఠశాలలు: రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

తర్వాతి కథనం
Show comments