Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరాభాయ్‌ సిల్వర్ గెలిస్తే ప్రియా మాలిక్‌కు బంగారు పతకం...

Webdunia
ఆదివారం, 25 జులై 2021 (12:33 IST)
టోక్యో ఒలింపిక్స్‌ క్రీడల్లో మీరాభాయి చాను వెండి పతకాన్ని గెలుచుకున్నారు. దీంతో ఆమె దేశానికి గర్వకారణంగా నిలిచారు. అయితే, ఆదివారం మరో క్రీడా వేదికగా ఓ యువతి బంగారు పతకం గెలిచి భారత దేశ పతాకాన్ని రెపరెపలాడించింది. ఆమె పేరు ప్రియా మాలిక్.
 
ఆదివారం జరిగిన రెజ్లింగ్ వరల్డ్ క్యాడెట్ ఛాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ ప్రియా మాలిక్ స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది. హంగేరీలో జరుగుతున్న ఈ రెజ్లింగ్ పోటీల్లో 73 కేజీల విభాగంలో ఫైనల్‌లో విజయం సాధించి పసిడి కైవసం చేసుకుంది. 
 
టోక్యో ఒలింపిక్స్‌లో మీరాభాయ్ ఛాను రజతం గెలిచిన తర్వాతి రోజే, మరో ప్రపంచ క్రీడా వేదికపై భారత మహిళా అథ్లెట్లు సత్తా చాటడం విశేషం. టోక్యో ఒలింపిక్స్‌లో కూడా భారత రెజ్లర్లపై భారీ అంచనాలే ఉన్నాయి. 
 
57 కేజీల విభాగంలో రవి కుమార్ దహియా, 65 కేజీల విభాగంలో భజరంగ్ పూనియా, 86 కేజీల విభాగంలో దీపక్ పూనియా పురుషుల జాబితాలో పోటీపడనుండగా మహిళల విభాగంలో సీమా, వినేశ్ ఫోగర్, అన్షు, సోనమ్ బరిలో దిగబోతున్నారు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments