Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాడ్మింటన్‌లో నెరవేరిన భారత దశాబ్దాల కాల కల... ఎలా?

Webdunia
సోమవారం, 1 మే 2023 (10:18 IST)
బ్యాడ్మింటన్‌లో భారత దశాబ్దాల కాల కల నెరవేరింది. భారత్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్ - చిరాక్ శెట్టి జోడీలు చరిత్ర సృష్టించారు. దుబాయ్ వేదికగా జరిగిన బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో మలేషియాకు చెందిన జోడీని చిత్తు చేశారు. ఫలితంగా 58 యేళ్ల తర్వాత భారత్‌కు స్వర్ణ పతంకం లభించింది. దుబాయ్ అల్ నసర్ క్లబ్‌లోని షేక్ రషీద్ బిన్ హమ్దాన్ ఇండోర్ హాల్‌లో ఆదివారం జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్లు అయిన మలేషియాకు చెందిన యెన్ సిన్ -ట్రియో జోడీతో ప్రపంచ ఆరో ర్యాంకర్లు అయిన సాత్విక్ - చిరాగ్ జోడీ తలపడి ప్రత్యర్థి జంటను చిత్తు చేసింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో ఓడిన భారత జట్టు ఆ తర్వాత పుంజుకుని 16-21, 21-17, 21-19 సెట్లతో విజయం సాధించి దేశానికి బంగారు పతకం సాధించి పెట్టారు. ఇది భారత్‌కు చారిత్రక విజయం. దాదాపు 58 యేళ్ల తర్వాత ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్స్ పోటీల్లో భారత్‌కు స్వర్ణ పతకం వచ్చింది. 1965లో భారత ఆటగాడు దినేశ్ ఖన్నా పురుషుల సింగిల్స్‌లో బంగారు పతకం గెలుచుకున్నాడు. ఆ తర్వాత ఇన్నాళ్లకు ఇపుడు బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో ఈ స్వర్ణపతకం లభించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

తర్వాతి కథనం
Show comments