Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశీయ మార్కెట్లలో రికార్డుల జోరు.. లాభాలతో పరుగులు

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (10:57 IST)
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. దేశీయ మార్కెట్లలో రికార్డుల జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో వారం కూడా దేశీయ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆర్థిక వృద్ధికి ఆర్‌బీఐ నిర్ణయంతో భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. 
 
సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయి 51 వేలను సెన్సెక్స్ దాటింది. 600 పాయింట్ల లాభంతో 51,314 వద్ద సెన్సెక్స్ ట్రేడ్ అవుతోంది. 180 పాయింట్ల లాభంతో 15,104 వద్ద నిఫ్టీ ట్రేడవుతోంది. బడ్జెట్ జోరుతో గతవారమంతా సూచీలు లాభాలు దక్కించుకున్న విషయం తెలిసిందే.
 
దశాబ్దకాలంలోనే అత్యుత్తమ వారం వారీ లాభాలు గత వారంలో నమోదు చేసిన దేశీ స్టాక్ సూచీలు తాజావారం తొలి సెషన్‌లోనూ అదే దూకుడు చూపుతున్నాయి. ఆర్థిక రికవరీపై పరపతి విధాన సమీక్షలో ఆర్‌బీఐ చేసిన సానుకూల వ్యాఖ్యలకు తోడు గ్లోబల్ మార్కెట్ల పాజిటివ్ సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments