Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతర్జాతీయ సానుకూలత - దూసుకెళ్లిన మార్కెట్లు

ఠాగూర్
బుధవారం, 9 అక్టోబరు 2024 (16:51 IST)
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూలతలు, చైనా ఉద్దీపన చర్యల వంటి పరిణామాలతో మార్కెట్లు ఈ రోజు లాభాలను చవిచూశాయి. గత ఆరు సెషన్లుగా నష్టాలను మూటగట్టుకున్న మార్కెట్లు బుధవారం లాభాల బాట పట్టాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 584 పాయింట్లు లాభపడి 81,634 పాయింట్లకు చేరుకుంది. అలాగే, నిఫ్టీ సైతం 217 పాయింట్లు లాభపడి 25,013 వద్ద ఆగింది. ఈ రోజు ఆదానీ పోర్ట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్, హెచ్.డి.ఎఫ్.సి. ఎల్ అండ్ టి కంపెనీల షేర్లు లాభపడ్డాయి. అలాగే టాటా స్టీల్, టైటాన్, బజాజ్ ఫిన్ సర్వ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు నష్టపోయాయి. 
 
మరోవైపు, భారత రిజర్వు బ్యాంకు రెపో రేటును వరుసగా పదోసారి 6.5 శాతంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం జరిగిన ద్రవ్య విధాన కమిటీ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. రెపో రేటు యధాతథంగా కొనసాగించాలంటూ ఆరుగురిలో ఐదుగురు సభ్యుల సానుకూలంగా ఓటు వేశారని ఆయన గుర్తు చేశారు. ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం, సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. ఎఫ్‌డీఎస్ రేటు 6.25 శాతంగాను, ఎంఎస్ఎఫ్ రేటు, సేవింగ్స్ రేటు 6.75 శాతంగా ఉన్నాయని ఆయన వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments