Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశీ స్టాక్ మార్కెట్ : తొలిసారి 76 వేల మార్క్‌ను చేరుకున్న సెన్సెక్స్

sensex

ఠాగూర్

, సోమవారం, 27 మే 2024 (17:26 IST)
బాంబే స్టాక్ మార్కెట్‌ సూచీలు సోమవారం పరుగులు తీశాయి. ఒక దశలో 76 వేల మార్క్‌ను తాకాయి. సాయంత్రానికి మళ్లీ ఫ్లాట్‌గా ముగిశాయి. సోమవారం ఉదయం ఆసియా మార్కెట్ నుంచి సానుకూల సంకేతాలతో లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. ఇంట్రాడేలో భారీ లాభాల్లోకి వెళ్లాయి. ఈ క్రమంలో రెండు ప్రధాన సూచీలు సరికొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి. ఓ దశలో 600 పాయింట్ల మేర లాభపడిన సెన్సెక్స్‌.. ఆఖరులో అమ్మకాల ఒత్తిడి కారణంగా లాభాలన్నీ కోల్పోయి ఫ్లాట్‌గా ముగిసింది. నిఫ్టీ 22,900 ఎగువన ముగిసింది.
 
సోమవారం ఉదయం సెన్సెక్స్ సూచీ 75,655.46 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 76,009.68 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాలను నమోదు చేసింది. చివరికి 19.89 పాయింట్ల నష్టంతో 75,390.50 వద్ద ముగిసింది. నిఫ్టీ 24.65 పాయింట్లు కోల్పోయి 22,932.45 వద్ద స్థిరపడింది. 
 
అలాగే, డాలరుతో రూపాయి మారకం విలువ 83.13గా ఉంది. సెన్సెక్స్‌లో ఇండస్ ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ షేర్లు లాభపడగా.. విప్రో, ఎన్టీపీసీ, సన్‌ఫార్మా, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఐటీసీ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర 82.62 వద్ద ట్రేడవుతుండగా.. ఔన్సు బంగారం ధర 2345.90 డాలర్ల వద్ద కొనసాగుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నగరి అసెంబ్లీ స్థానంలో గెలుపుపై జోరుగా బెట్టింగ్‌లు