సంక్రాంతికి నోరూరించే పనీర్ రసమలాయ్ ఎలా చేయాలి

పనీరును తురుముకుని చిన్నపాటి వుండలుగా సిద్ధం చేసుకోవాలి. పాలను చిక్కగా మరిగించుకోవాలి. పంచదార పొడిని నీటిలలో నానబెట్టి సిరప్‌లా చేసుకోవాలి. ఆపై వుండగా చేసిన పనీర్‌ను పంచదార సిరప్‌లో చేర్చి పది నిమిషాల

Webdunia
బుధవారం, 10 జనవరి 2018 (13:44 IST)
పండగ వేళ సంప్రదాయ వంటకాలతో పాటు స్వీట్లు ముందే సిద్ధం చేసుకుని స్నేహితులు, బంధువులకు పంచిపెట్టాలనుకుంటున్నారా..? అయితే నోరూరించే రసమలాయ్ స్వీటును ఇంట్లోనే తయారు చేసి.. మీ స్నేహితులకు పంచిపెట్టండి. సంక్రాంతికి వెరైటీగా రసమలాయ్ స్వీట్ ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు : 
పాలు- ఒక లీటర్ 
పంచదార పొడి - 200 గ్రాములు
ఏలకుల పొడి - ఒక టీ స్పూన్ 
పనీర్ - 350 గ్రాములు 
కుంకుమ పువ్వు -రెండు చిటికెలు 
పిస్తా - అలంకరణకు 
 
తయారీ విధానం : 
పనీరును తురుముకుని చిన్నపాటి వుండలుగా సిద్ధం చేసుకోవాలి. పాలను చిక్కగా మరిగించుకోవాలి. పంచదార పొడిని నీటిలలో నానబెట్టి సిరప్‌లా చేసుకోవాలి. ఆపై వుండగా చేసిన పనీర్‌ను పంచదార సిరప్‌లో చేర్చి పది నిమిషాలు ఉడికించాలి. పాలను బాగా మరిగించి రబ్రీ చేసుకుని.. అందులో కుంకుమ పువ్వు చేర్చాలి. ఈ మిశ్రమంలో పనీరు ఉండలను చేర్చి పిస్తాతో గార్నిష్ చేసి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తీరం దాటిన తుఫాను : ఏపీలో కుండపోతవర్షాలు ... పునరావాస కేంద్రాల్లో 75 వేల మంది

అంతర్వేదిపాలెంలో తీరాన్ని తాకిన మొంథా తుఫాను

Montha Effect: ఈ టైంలో బీచుల దగ్గర వీడియోస్ చేసుకోవడం కరెక్ట్ కాదు.. నారా లోకేష్

చంద్రబాబు గ్రేట్.. హరీష్ రావు తండ్రి పట్ల సంతాపం.. మొంథా పనులు ఒకవైపు జరుగుతున్నా?

ఏపీపై మొంథా తుఫాను తీవ్ర ప్రభావం : బాబు - పవన్ ఉన్నతస్థాయి సమీక్ష

అన్నీ చూడండి

లేటెస్ట్

Sparsha Darshanam: శ్రీశైలం స్పర్శ దర్శనం చేసుకునే భక్తులకు ఉచిత లడ్డూ

27-10-2025 సోమవారం దినఫలాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు

Skanda Sashti 2025: స్కంధ షష్ఠి రోజున పూజ ఎలా చేయాలి.. ఏ శ్లోకాన్ని పఠించాలి?

ఇంద్రకీలాద్రిపై నాగుల చవితి వేడుకలు.. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో?

26-10-2025 ఆదివారం దినఫలాలు - ప్రయాణంలో అవస్థలు ఎదుర్కుంటారు...

తర్వాతి కథనం
Show comments