Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ బస్సెక్కితే గంటన్నరలో శ్రీవారి దర్శనం.. ఎలా?

సాధారణంగా తిరుమల శ్రీవారి స్వామి దర్శనం అంటే గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిందే. ముఖ్యంగా వేసవిలో అయితే ఈ పరిస్థితి మరింత వర్ణనాతీతం. కేవలం దర్శన భాగ్యమే కాదు.. చివరకు గదులు కూడా దొరకడం గగనమే.

Webdunia
బుధవారం, 13 జూన్ 2018 (12:21 IST)
సాధారణంగా తిరుమల శ్రీవారి స్వామి దర్శనం అంటే గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిందే. ముఖ్యంగా వేసవిలో అయితే ఈ పరిస్థితి మరింత వర్ణనాతీతం. కేవలం దర్శన భాగ్యమే కాదు.. చివరకు గదులు కూడా దొరకడం గగనమే.
 
దీన్ని దృష్టిలో ఉంచుకుని, భక్తుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీలతో ప్రత్యేక బసులను నడుపుతోంది. చెన్నై, బెంగుళూరు వంటి పొరుగు రాష్ట్రాల రాజధానుల నుంచి ఈ తరహా బసులు నడుస్తున్నాయి. ఇపుడు కొత్తగా, సముద్రతీర నగరం వైజాగ్ నుంచి కూడా ఈ బస్సులను నడిపేందుకు ఏపీటీడీసీ ఏర్పాట్లు చేసింది. 
 
ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో తిరుమలలో దర్శనానికి అనువుగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ బస్సుల్లో తిరుమలకు వెళితే రద్దీతో పనిలేకుండా గంట నుంచి గంటన్నర వ్యవధిలోనే వేంకటేశ్వరుని దర్శనం చేయించే సదుపాయం కల్పించనుంది. చాలాకాలం కిందటే రూపొందించిన ప్రతిపాదనలను ఈనెలాఖరు నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయాలని భావిస్తున్నారు. 
 
విశాఖ నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటలకు వొల్వో బస్సు బయలుదేరి మరుసటి రోజు తిరుపతికి చేరుకుంటుంది. ప్రయాణికులకు తిరుపతిలో వసతి కల్పిస్తారు. తిరుపతి నుంచి తిరుమలకు ఆర్టీసీ బస్సులో తీసుకెళ్లి వేగంగా దర్శనం కల్పించి వెనక్కు తీసుకువస్తారు. అదే రోజు మధ్యాహ్నం తిరుపతిలో బయలుదేరి శ్రీకాళహస్తిలో దర్శనం కల్పిస్తారు. ఆ మరుసటి రోజు ఉదయం విశాఖకు బస్‌ చేరుకుంటుంది. మూడురోజుల టూర్‌కు సంబంధించి ఒకరికి నాలుగువేల రూపాయలతో ప్యాకేజీ రూపొందించారు. అయితే, ఈ ప్యాకేజీ వివరాలకు సంబంధించి ఏపీటీడీసీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె.. పరువు పోయిందని తండ్రి ఆత్మహత్య

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments