Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా నాన్న ఇక విశ్రాంతి తీసుకుంటే మంచిది : ఐశ్వర్య

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈమె భర్త, తమిళ యువ హీరో ధనుష్ నిర్మాతగా మారి రజినీకాంత్ హీరోగా నిర్మించిన చిత్రం "కాలా". ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది

Webdunia
బుధవారం, 13 జూన్ 2018 (10:33 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈమె భర్త, తమిళ యువ హీరో ధనుష్ నిర్మాతగా మారి రజినీకాంత్ హీరోగా నిర్మించిన చిత్రం "కాలా". ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో రజినీ ఫ్యామిలీ అంతా 'కాలా' విజయోత్సవ సంబరాల్లో మునిగిపోయివున్నారు.
 
ఈ నేపథ్యంలో ఐశ్వర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'నాన్న ఇకపై సినిమాలు మానేసి, కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయిస్తే బాగుంటుంది' అని వ్యాఖ్యానించింది. తన నటన ద్వారా ఎంతో మంది సినీ అభిమానులను అలరిస్తున్న నాన్న... పూర్తిగా ఆ రంగంపైనే దృష్టిని కేంద్రీకరించడం తగదని హితవు పలికింది. 
 
అలాగనీ, అర్జెంటుగా సినీ ఇండస్ట్రీని వదిలివేయాలని తాను కోరడం లేదని, క్రమంగా సినిమాలను తగ్గించుకుంటూ, కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని కోరింది. సంతోషమొస్తే ఎక్కువగా పొంగిపోకూడదని, దు:ఖం వస్తే కుంగిపోకూడదని నాన్న చెప్పే మాటలు తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. సుఖదు:ఖాలను సమానంగా భరించాలనేదే తన తండ్రి సిద్ధాంతమని ఐశ్వర్య చెప్పుకొచ్చింది. 
 
ఇకపోతే, కాలా చిత్రానికి మంచి హిట్ టాక్‌ రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. పైగా, ఈ చిత్రంతో తన భర్త నిర్మాత కూడా రాణించగలడనే నమ్మకం కుదిరిందనీ, ఈ విషయాన్ని తన తండ్రే స్వయంగా చెప్పారని ఐశ్వర్య తెలిపింది. 

సంబంధిత వార్తలు

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

ఏపీలో 81.86 శాతం.. పిఠాపురంలో 86.36 శాతం పోలింగ్ : ముకేశ్ కుమార్ మీనా

బోరబండ వద్ద మేకప్ ఆర్టిస్టును హత్య చేసిన దుండగులు

భర్తతో కలిసి వుండటం ఇష్టం లేదు.. ప్రియుడితో రెండు నెలల గర్భిణి పరార్

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments