Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు.. 30 నుంచి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు

Webdunia
బుధవారం, 30 మార్చి 2022 (11:09 IST)
శ్రీశైలం ఉగాది మహోత్సవాలకు ముస్తాబువుతోంది. ఈ నెల 30 నుంచి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు స్వామివారికి విశేష అర్చనలు, ప్రత్యేక పూజలు, వాహనసేవలు, ప్రభోత్సవం, రథోత్సవం, వీరాచార విన్యాసాలు, పంచాంగ శ్రవణం, పండిత సత్కార కార్యక్రమాలు ఘనంగా జరిపించనున్నట్లు శ్రీశైల ఆలయ అధికారులు వివరించారు. 
 
ఉగాది ఉత్సవ ప్రారంభం రోజున యాగశాల ప్రవేశంలో మొదలై ప్రతి రోజు ఉదయం హోమజప కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. సాయంత్రం వేళలో వాహనసేవల్లో స్వామి అమ్మవార్లు గ్రామోత్సవంలో భక్తులకు దర్శమిస్తారని తెలిపారు. ఉగాది పర్వదినాన దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞ పంచాంగ పఠన కార్యక్రమం ఉంటుందని  ఈవో లవన్న చెప్పారు. 
 
అదే రోజు సాయంత్రం జరిగే రథోత్సవంలో అమ్మవారైన భ్రమరాంబ రమావాణి సహిత రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనమిస్తారు. అదే విధంగా మహోత్సవాల్లో ఆఖరి రోజున నిజరూపాలంకరణలో భ్రమరాంబ అమ్మవారు దర్శనం ఇస్తారని ఈవో వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

ఊరెళ్లిన భర్త... గొంతుకోసిన స్థితిలో కుమార్తె... ఉరికి వేలాడుతూ భార్య...

అన్నీ చూడండి

లేటెస్ట్

11-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : ఆశలు ఒదిలేసుకున్న ధనం?

11 శుక్రవారాలు ఇలా శ్రీ మహాలక్ష్మీ పూజ చేస్తే.. ఉత్తర ఫాల్గుణి రోజున?

10-04-2025 గురువారం మీ రాశిఫలాలు : ఇంటిని అలా వదిలి వెళ్లకండి

ఇంట్లో శివలింగాన్ని పూజించవచ్చా? బొటనవేలు కంటే పొడవు వుండకూడదు

పండుగలు చేసుకోవడం అంటే ఏమిటి?

తర్వాతి కథనం
Show comments