Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు-మార్చి 31తేదీన కొత్త జిల్లాలపై నోటిఫికేషన్

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు-మార్చి 31తేదీన కొత్త జిల్లాలపై నోటిఫికేషన్
, శనివారం, 26 మార్చి 2022 (10:21 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు తుదిదశకు చేరుకుంది. అభ్యంతరాలను పరిశీలించి మార్చి 31 తేదీన కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
ఉగాది నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీని కోసం ప్రభుత్వం కసరత్తు కూడా తుది అంకానికి చేరుకుంది.
 
ఈ రోజు కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం జగన్ మోహన్ రెడ్డి సమీక్ష జరిపారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించారు సీఎం.
 
గంటన్నర పాటు అభ్యంతరాలపై సమీక్ష జరిపారు. పలువురు ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసినసంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాహనదారులకు పెట్రోల్ మంట.. పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు