Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్యాణమస్తు పునరుద్ధరణ కోసం తితిదే చర్యలు... మే 28న తొలి ముహూర్తం

Webdunia
గురువారం, 18 ఫిబ్రవరి 2021 (09:11 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుల్లో కళ్యాణమస్తు ఒకటి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ పథకం అమలును తాత్కాలికంగా నిలిపివేశారు. ఇపుడు రాష్ట్రంలో కరోనా శాంతించింది. దీంతో 'కల్యాణమస్తు' కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సన్నద్ధమైంది. ఈ సామూహిక వివాహాల కోసం మొత్తం మూడు ముహూర్తాలను ఖరారు చేసిందని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు.
 
ఈ మూడు ముహుర్తాల్లో భాగంగా, తొలి ముహూర్తం మే 28న మధ్యాహ్నం 12.34 నుంచి 12.40 మధ్య, అక్టోబరు 30న ఉదయం 11.04 నుంచి 11.08 మధ్య రెండోది, నవంబరు 17న ఉదయం 9.56 నుంచి 10.02 మధ్య మూడో ముహూర్తాన్ని ఖరారు చేసినట్టు ఈవో తెలిపారు. 
 
జి.బాలసుబ్రహ్మణ్యం, కుప్పా శివసుబ్రహ్మణ్యం అవధాని, అర్చకం వేణుగోపాల దీక్షితులు, వేదాంతం శ్రీవిష్ణు భట్టాచార్యులతో కూడిన పండిత మండలి సమావేశమై ఈ ముహూర్తాలను నిర్ణయించింది. అనంతరం కల్యాణమస్తు లగ్నపత్రికను జవహర్‌రెడ్డి, ధర్మారెడ్డిలకు అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విశాఖపట్నంలో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ ప్రారంభం, భారతదేశంలో భారీ విస్తరణ ప్రకటన

హైటెక్ సిటీలో కోలివింగ్ స్పేసెస్, అమ్మాయిలు-అబ్బాయిలు ఒకే గదిలో వుంటే?: వీహెచ్ ఆందోళన

శుక్రవారం, జూన్ 27న అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ శ్రీ జగన్నాథ రథయాత్ర

Elephant Tusks: జైలులో వుంటూనే ఏనుగు దంతాల రవాణాకు స్కెచ్.. బయటికొచ్చి?

వికారాబాద్ పాఠశాల- ఆవు మెదడుతో పాఠాలు- టీచర్ సస్పెండ్

అన్నీ చూడండి

లేటెస్ట్

Ashadha Amavasya 2025: ఆషాఢ అమావాస్య- వేపచెట్టును నాటితే.. తులసీ పూజ చేస్తే ఏంటి ఫలితం?

UPI-enabled kiosks: తిరుమల లడ్డూ చెల్లింపులు ఇక ఈజీ-యూపీఐ కియోస్క్‌‌లు రెడీ

24-06-2025 మంగళవారం దినఫలితాలు - చీటికి మాటికి అసహనం చెందుతారు...

Ashadha Amavasya: ఆషాఢ అమావాస్య- జూన్ 25 బుధవారం రోజున ఇలా చేస్తే.. కర్మలు మటాష్

గరుడ పురాణం: 28 రకాల నరకాలుంటాయట.. ఆత్మపై ఆకలితో ఉన్న కుక్కలతో దాడి

తర్వాతి కథనం
Show comments