వ్యాక్సిన్ సర్టిఫికేట్ లేదా నెగెటివ్ రిపోర్టు ఉంటేనే శ్రీవారి దర్శనం : తితిదే కొత్త రూల్

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (10:17 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది. ఇకపై కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్న వారికే స్వామి దర్శనభాగ్యం లభించనుంది. 
 
వ్యాక్సినేషన్ పూర్తయినట్టు సర్టిఫికెట్ కానీ, దర్శనానికి మూడు రోజులు ముందు చేయించుకున్న కరోనా పరీక్ష నెగటివ్ సర్టిఫికెట్ కానీ ఉంటేనే దర్శనానికి అనుమతి ఇస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తేల్చి చెప్పారు. 
 
అలాగే, శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను ఈ నెల 25 నుంచి ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామన్నారు. ఈ నెల 26 నుంచి అక్టోబరు 31 వరకు రోజుకు 8 వేల టోకెన్లు విడుదల చేయనున్నట్టు చెప్పారు. 
 
సర్వదర్శనం టోకెన్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చిన తర్వాత తిరుపతిలో ఆఫ్‌లైన్ ద్వారా ఇస్తున్న టోకెన్లను నిలిపివేయనున్నారు. అలాగే, అక్టోబరు నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.
 
తిరుమలకు శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఉండేందుకు వీలుగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులోభాగంగా, కరోనా వైరస్ బాధితులు కొండపైకి రాకుండా ఉండేందుకే ఈ కొత్త నిబంధనను అమలు చేస్తున్నట్టు ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల్లూరు పెన్నా బ్యారేజ్ పైన డబుల్ మర్డర్, కాలువలో మృతదేహాలు

YCP Digital Book: వైకాపా డిజిటల్ బుక్.. జగన్‌కు తలనొప్పి

స్నేహితుడి గదికి తీసుకెళ్లి అత్యాచారం చేసి ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు

టిక్కెట్ లేకుండా రైలెక్కి ... టీసీపైనే ఎదురుదాడి చేసిన మహిళ (వీడియో)

పుట్టినరోజు శుభాకాంక్షలు నా ప్రియమైన శ్రీనికా.. పాడి కౌశిక్ రెడ్డి స్పెషల్ వీడియో (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

05-10-2025 ఆదివారం దిన ఫలితాలు - ఆర్థికస్థితి నిరాశాజనకం.. దుబారా ఖర్చులు విపరీతం...

05-10-2025 నుంచి 11-10-2025 వరకు మీ వార రాశిఫలాలు

అక్టోబరు 2025లో జాక్‌పాట్ కొట్టనున్న 4 రాశుల వారు

ఈ రోజు శని మహా ప్రదోషం.. శివాలయానికి వెళ్లి పూజ చేయడం తప్పనిసరి

04-10-2025 శనివారం దిన ఫలితాలు - ఖర్చులు సామాన్యం.. చెల్లింపుల్లో జాగ్రత్త...

తర్వాతి కథనం
Show comments