Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త వివాదంలో తితిదే - లవుడు ఒక్కడే.. కుశడు కాదా? (video)

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (16:45 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) తాజాగా మరో కొత్త వివాదంలో చిక్కుకుంది. తితిదే ఆధ్వర్యంలో ప్రచురితమయ్యే సప్తగిరి మాసపత్రికలో భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని వక్రీకరిస్తూ కథనం ప్రచురితమైంది. సీతారాములకు ఒక్కరే కుమారుడని పేర్కొంది. సీతకు లవుడు ఒక్కడే కుమారుడని.. కుశుడు దర్భతో చేసిన బొమ్మ అంటూ జానపద కథలో కథనం ప్రచురితమైంది. ఈ కథను తిరుపతికి చెందిన తొమ్మిదో తరగతి బాలుడు పునీత్ రాశాడు. 
 
ఈ వార్త చూడగానే బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆగ్రహం వ్యక్త చేస్తూ, ఆందోళనకు దిగారు. తితిదే వంటి ధార్మిక సంస్థ వాల్మీకి రాసిన రామాయణాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జానపదాల్లో రకరకాల ప్రచారాలపై ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా రామాయణాన్ని తప్పుదారి పట్టించినట్లు అవుతందని వారు తెలిపారు. ఈ వ్యవహారంపై భక్తులు కూడా తితిదేపై మండిపడుతోంది.
 
ఇటీవలే తితిదే ఓ వివాదం నుంచి బయటపడింది. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న శ్రీవారి నిరర్ధక ఆస్తులను విక్రయించాలని తితిదే నిర్ణయించింది. ఈ నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో తితిదే తన నిర్ణయంపై వెనక్కి తగ్గింది. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 31 మృతదేహాల గుర్తింపు.. మిగిలినవాటి పరిస్థితి ఏంటి?

బాసరలో విషాదం - గోదావరి నదిలో మునిగి నలుగురు మృతి

చింతల్‌కుంట వద్ద తెగిపడిన హైటెన్షన్ వైర్లు - ఇద్దరు సజీవదహనం

ఫ్లైట్‌లో ఏసీ పని చేయడం లేదు... ఏదో తేడాగా ఉంది.. భర్తకు ఫోన్ చేసిన భార్య.. అంతలోనే...

అహ్మదాబాద్ విమాన ప్రమాదం : వివరమ ఇచ్చిన టర్కీ సంస్థ

అన్నీ చూడండి

లేటెస్ట్

13-06-2025 శుక్రవారం దినఫలితాలు - లక్ష్యసాధనకు కృషి ప్రధానం...

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

11-06-2025 బుధవారం దినఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు....

Strawberry Moon: ఆకాశంలో స్ట్రాబెర్రీ చంద్రుడు- చంద్రస్నానం అంటే ఏమిటి?

తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక జ్యేష్ఠాభిషేకం.. ఎందుకు చేస్తారంటే?

తర్వాతి కథనం
Show comments