Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (14:25 IST)
శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. కలియుగ వైకుంఠం తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని భక్తులు దర్శించుకోవచ్చు. ఈ నెల 8 నుంచి నిబంధనలతో కూడిన దర్శనాలకు టీటీడీ అమమతి ఇచ్చింది. మొదటగా టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ రన్ నిర్వహించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
 
రోజుకు పదివేల మందికి 16 గంటల నుంచి 18 గంటల వరకు అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం. గంటకు 500 మందిని దర్శనానికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. తిరుమల,తిరుపతిలో ఉన్న స్థానికులకు రెండు వారాల పాటు దర్శనానికి ఇవ్వనున్నారు.
 
ప్రస్తుతానికి స్థానికులకు మాత్రమే ఈ వెసులుబాటు కల్పించనున్నారు. స్ధానికులతో ట్రయల్ రన్ విజయవంతం అయితే క్రమంగా చిత్తూరు జిల్లా వాసులకు, ఆ తర్వాత రాష్ట్ర ప్రజలకు అమనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం. 
 
ఇక భక్తులు ఖచ్చితంగా ఆరు అడుగుల భౌతిక దూరాన్ని పాటించాల్సి ఉంటుంది. భక్తుల దర్శనానికి గాను అనుమతించాలని కోరుతూ టీటీడీ ఎగ్జ్సిక్యూటివ్ అధికారి రాసిన లేఖ నేపథ్యంలో స్పందించిన ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జేఎస్‌వీ ప్రసాద్... అందుకు అనుమతిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

సికింద్రాబాద్ రైల్వే స్టేషనులో పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ హంగామా (Video)

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ నిప్పులు వర్షం - 66 మంది మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

Govinda: మీ వయస్సు 25 ఏళ్ల కంటే తక్కువా? ఐతే శ్రీవారి వీఐపీ దర్శనం ఖాయం.. ఎలా?

15-05-2025 గురువారం దినఫలితాలు - అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు...

SaraswatiPushkaralu: కాళేశ్వరం త్రివేణి సరస్వతి పుష్కరాలు- 12 సంవత్సరాలకు ఒకసారి.. సర్వం సిద్ధం

14-05-2025 బుధవారం దినఫలితాలు - విందులు వేడుకలకు ఆహ్వానం

13-05-2025 మంగళవారం దినఫలితాలు - అవకాశాలను చేజార్చుకోవద్దు...

తర్వాతి కథనం
Show comments