Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్న లడ్డూ ధర రూ.50.. పెద్ద లడ్డూ ధర రూ.200

శ్రీవారి భక్తులతో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం పేరుతో భారం మోపింది. శ్రీవారి ప్రసాదాల ధరలను రెట్టింపు చేసింది. సిఫార్సు లేఖలపై ఇచ్చే ప్రసాదాల ధరను పెంచింది.

Webdunia
గురువారం, 21 డిశెంబరు 2017 (09:40 IST)
శ్రీవారి భక్తులతో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం పేరుతో భారం మోపింది. శ్రీవారి ప్రసాదాల ధరలను రెట్టింపు చేసింది. సిఫార్సు లేఖలపై ఇచ్చే ప్రసాదాల ధరను పెంచింది. ఫలితంగా ఇప్పటివరకు రూ.25కు విక్రయిస్తున్న చిన్న లడ్డూ ధరను రూ.50కు పెంచింది. అలాగే, పెద్ద లడ్డూ ధరను రూ.100 నుంచి రూ.200కు పెంచింది. అలాగే, వడ ధరను రూ.25 నుంచి రూ.100కు పెంచింది. పెరిగిన నూతన ధరలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయని టీటీడీ అధికారులు తెలిపారు.
 
మరోవైపు, కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలలో గురువారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారిని దర్శించుకునేందుకు కేవలం రెండు కంపార్టుమెంట్లలోనే భక్తులు వేచి ఉన్నారు. అలాగే స్వామి వారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 
 
నడకదారి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు 2 గంటల సమయం పడుతుండగా ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కూడా 2 గంటల సమయం పడుతోంది. కాగా... తిరుమల శ్రీవారిని బుధవారం 62, 351 మంది భక్తులు దర్శించుకున్నట్లు తితిదే అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments